– మళ్ళీ చెప్పులు, పాస్ బుక్ లు లైన్ లో పెట్టే దౌర్భాగ్యం వచ్చింది
– కేసీఆర్ ముందుచూపుతో పదేళ్లలో యూరియా కొరత రాలేదు
– అరవింద్ కు పలుకుబడి ఉంటే మోదీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురా
– బడే భాయ్ కి కోపం వస్తుందనా… చోటే భాయ్ లోపలికి వెళ్తాడనా ?
– రైతు ఏమైనా యూరియా తింటాడా ?
– మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్ : రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరం అవుతుంది.
నెలరోజుల్ నుంచి బిఆర్ఎస్ నుంచి అన్ని వేదికల మీద ప్రభుత్వాని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. అయినా కళ్ళు కనిపిస్తలేదా? అన్నం లేకుండా, నిద్రాహారాలు లేక గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. చెప్పులు లైన్లో , పాస్ బుక్ లు లైన్ లో పెట్టే పరిస్థితి మళ్లీ వచ్చింది.
రైతాంగం ఇబ్బంది పాలవుతున్నప్పటికీ చీమ కుట్టినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. నిజామాబాద్, బాల్కొండ నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. తండాల్లో నుంచి వచ్చి యూరియా తీసుకుపోవడానికి ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వానికి కనబడడం లేదు. అట్లనే బాల్కొండ మండలంలో 100 సంచులు వచ్చాయి. 10 గ్రామాలకు ఎన్ని ఇస్తావు ?
మెండోరా, వేల్పూరు మండలంలో 1 వెయ్యికి 90 సంచులు వచ్చాయి. ఎట్లా పంచుతారు ? మోర్తాడ్ మండలం డోన్ పాల్ గ్రామంలో పోలీసులను పెట్టీ టోకెన్లు పంపినీ చేశారు. ఎప్పుడైన ఇలా జరిగిందా ? తోర్తి గ్రామంలో కూడా ఇదే కష్టాలు ఉన్నాయి. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప వేరే ధ్యాస లేదు. కమీషన్లు దండుకోవడం మీదనే దృష్టి పెట్టారు. ప్రజల, రైతులు కష్టాలు మాత్రం పట్టవు. ఎంత అవసరం వుండే ? ముందే లెక్కలు తీసి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు కేంద్రం రాష్ట్రానికి యూరియా పంపించాలి.
కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక రైతులకు అవస్థలు ఎదురవుతున్నాయి. అవసరం ఉన్న యూరియాను కేంద్రాన్ని అడగడం తెలివి లేక కష్టాలు ఉన్నాయి. యూరియా కొరతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. కాంగ్రెస్, బీజేపీ లకు 16 మంది ఎంపీలు ఉన్నారు. రైతులు ఇంత ఇబ్బంది పడితే ఎంపీలు ఏమి చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడని మీ పదవులు ఎందుకు ? కాంగ్రెస్, బీజేపీ చేయడం వల్ల రైతులు రోడ్డున పడ్డారు.
రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే అరవింద్ ఎక్కడికి వెళ్లాడు ? పెద్ద మాటలు, అడ్డగోలుగా తిట్టే అరవింద్ యూరియా ఎందుకు తెప్పించడం లేదు. మోడీ దగ్గర చాలా విలువ, పలుకుబడి ఉందని చెప్పే నిజామాబాద్ ఎంపి అరవింద్ ఎందుకు మాట్లాడడం లేదు. బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేదు. వెంటనే మోదీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురావాలి.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు ఇలా చూడలేదు. కేసీఆర్ దూర దృష్టి రైతులకు స్వర్ణ యుగంగా విలసిల్లింది. కేసీఆర్ ముందుగానే లెక్కలు వేసి కేంద్రానికి మంత్రుల బృందాన్ని పంపి యూరియా తెప్పించే వారు. రైతులు యూరియా కోసం ఇంత గోస పడుతుంటే ఎంపీలు గాడిద పల్లు తోముతున్నారా ? యుద్ధం వల్ల యూరియా అందడం లేదని ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు. పనికి మాలిన యుద్ధం వలన యూరియా కొరత వచ్చిందని సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ముందుచూపు లేక యూరియా కొరత.
మోడీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురావాలి. రైతులు తిరగబడితే ఎంపీలు రాజీనామా చేయాల్సి వస్తుంది. యూరియా బస్తా ఇప్పించలేని అసమర్థ పాలకులు. మోడిని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ఎంపీలకు ఎందుకు లేదు. బడే భాయ్ కు కోపం వస్తుందా ? చోటే భాయ్ కి ఇబ్బంది కలుగుతదనా ? రైతుల బాధలు తీర్చలేనప్పుడు ఎందుకు ఆ ఎంపీ పదవులు ? రేవంత్ రెడ్డి బెయిల్ కాన్సిల్ అయి మళ్ళీ లోపలికి వెళ్తాడనా ?
కాంగ్రెస్ ఎంపీలు యూరియా కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడంలేదు ? ప్రజలకు మేలు చేయని మీ ఎంపీ పదవులు ఎందుకు ? రాజీనామాలు చేయండి. మోడీ దగ్గర పలుకుబడి ఉంటే అరవింద్ ఢిల్లీకి వెల్లి నిజామాబాద్ కు సరిపడా యూరియా తీసుకురావాలి. నిజామాబాద్ జిల్లాకు 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అయితే 72 వేల యూరియా వచ్చిందని అధికారులు చెపుతున్నారు. మరి వచ్చిన యూరియా ఎటు వెళ్ళింది ? కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్ కు వెళ్ళిందా? రైతులు స్టాక్ పెట్టుకుంటున్నారు అని కాంగ్రెస్ నేతలు, అధికారులు అంటున్నారు.
రైతు ఏమైనా యూరియా తింటాడా ? అబద్ధాల లెక్కలు చెప్పుతూ, యూరియా సరఫరా చేసే సత్తా లేక , యూరియా తెప్పించే తెలివిలేక కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు అవగాహన లేక రైతులు రోడ్డుపైన పడ్డారు. ఒక్కసారి కూడా రైతులకు కేసీఆర్ పాలనలో యూరియా కోసం లైన్ కట్టే దుస్థితి రాలేదు. రైతుకు యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ ఎంపీలు రాజీనామా చేయాలీ. పదవుల్లో ఉండడానికి అర్హత లేదు.