Suryaa.co.in

Andhra Pradesh

అదానీ డీల్ రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?

– జగన్ చేసిన డీల్స్ రద్దు చేయలేదు అంటే అవి సక్రమం అని ఒప్పుకుంటారా ?
– చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తడం లేదు
– జగన్ కి చంద్రబాబు కి ఏమిటి తేడా ?
జగన్.. మీది అతి తెలివినా? వెర్రితనమా ?
– అదానీ వద్ద జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారం పై ఏసీబీ కి పిర్యాదు
– బొత్స తీరు పచ్చ కామెర్లు వచ్చినట్లు ఉంది
– నేను నిజంగా పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ అడుగుకూడా బయట పెట్టడు
– జగన్ అవినీతి, నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించా
– అదానీ తో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి
– బీజేపీని పాతి పెట్టే రోజు త్వరలో వస్తుంది
– ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి

అమరావతి : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అయింది. సిక్స్ మంత్ అయ్యింది..మరి మీ సూపర్ సిక్స్ ఎక్కడ ? అమలు కాదు కదా…విధివిధానాలు కూడా లేవు. సూపర్ సిక్స్ పథకాలను కాలయాపన చేస్తున్నారు. సూపర్ సిక్స్ ప్రకటన చేసే నాటికి జగన్ గారు 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు. ఆ విషయం చంద్రబాబు కి తెలుసు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసే మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు.

రైతుకి 20 వేల ఆర్థిక సహాయం అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు.. ఎప్పుడు ఇస్తారో తెలియదు. 20 లక్షల ఉద్యోగాల విషయంలో ఎప్పుడు కల్పిస్తారు? టైమ్ బాండ్ అంటూ ఏమీ లేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15 వేలు ఇస్తా అన్నారు. ఈ ఏడాది గడిచి పోయింది.

15 వేలు ఒక్క బిడ్డకు ఇవ్వలేదు. 15 వందలు ప్రతి మహిళకు ఇస్తాం అన్నారు. మహాశక్తి విధివిధానాలు ఎంటో తెలియదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. 6 నెలలు దాటినా ఉచిత బస్సు పథకం పై చిత్తశుద్ది లేదు. చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. 6 నెలల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు..సంజాయిషీ ఇచ్చుకోవాలి.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి 1750 కోట్లు ముడుపులు తీసుకున్నారు. ఈ అంశం అమెరికా కోర్టుల్లో కేసు నమోదు అయింది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవు. చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తడం లేదు.జగన్ కి చంద్రబాబు కి ఏమిటి తేడా ? జగన్ రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు. నా పేరు లేదు అని జగన్ అతి తెలివిగా మాట్లాడాడు. నా పేరు ఎవరైనా చెప్పారా అంటున్నాడు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా ? మీది అతి తెలివినా? వెర్రితనమా ? మీకు వెర్రి పట్టింది అని జనాలు అనుకుంటున్నారు. ఇలాంటి వెర్రి వాడా 5 ఏళ్లు పాలించింది అని అనుకొనే ప్రమాదం ఉంది.

రాష్ట్రానికి 25 ఏళ్లు అదానీ పవర్ ఒక భారం పక్క రాష్ట్రాల్లో 1.99 పైసలు అమ్ముతుంటే…ఇక్కడ 2.49 పైసలు ఎక్కువ పెట్టీ ఎందుకు కొన్నారు ? రాష్ట్రంపై ప్రతి యూనిట్ కి 50 పైసలు అదనం. ఈ 50 పైసలు భారం ప్రజల మీద పడితే చంద్రబాబు కి ఓకే నా ? ట్రాన్స్ మిషన్ చార్జీలు లేవు అని జగన్ అంటున్నారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు యూనిట్ కి 1.70 పైసలు దాకా పడే అవకాశం అంటున్నారు.

దీనిపై చంద్రబాబు ఎటువంటి విచారణ చేస్తున్నారు ? ట్రాన్స్మిషన్ చార్జీలు ఉన్నాయా ? లేదా ? చెప్పాల్సిన భాధ్యత చంద్రబాబు పై ఉంది. ప్రతి ఏడాది సోలార్ పవర్ చార్జీలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు 10 రూపాయలు ఉండే యూనిట్ ధర ఇప్పుడు 1.99 పైసలు వచ్చింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. చార్జీలు తగ్గుతూంటే మీరు 25 ఏళ్లకు ఎందుకు MOU చేశారు.

జగన్ అధికారంలో వచ్చాకా చంద్రబాబు చేసిన ఒప్పందాలు రద్దు చేశారు. లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఉండకూడదు అన్నారు. ఇప్పుడు జగన్ ఎందుకు 25 ఏళ్లకు అదానీ తో ఒప్పందం చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళన చేసింది. కోర్టు లో కూడా కేసులు వేసింది. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశాడు. మరి మీరు అధికారంలో ఉన్నారు. ఈ విషయం పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?

అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని ఎందుకు మౌనంగా ఉన్నారు ? మీరు జగన్ చేసిన డీల్స్ రద్దు చేయలేదు అంటే… అవి సక్రమం అని ఒప్పుకుంటారా ? లేక అదానీ కి చంద్రబాబు భయపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం నెత్తిన విద్యుత్ సర్దుబాటు చార్జీలు మోపారు. 17500 కోట్లు ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ డీల్ పై చంద్రబాబు మౌనం వహిస్తే… ప్రజలు క్షమించరు. వెంటనే డీల్ ను క్యాన్సిల్ చేయండి. అదానీ తో చేసుకున్న ఒప్పందాలపై పరిశీలన చేయాలని సెంట్రల్ ERC కి లేఖ రాస్తున్నాం. ఈ డీల్ పై పరిశీలన చేయాలి.

బొత్స నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. పచ్చ కామెర్లు కమ్మినోనికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అంట. బొత్స తీరు కూడా ఇలానే ఉంది. నాతో వాళ్లకు పర్సనల్ ఇష్యూ లు ఉన్నాయని అనేది వాళ్ళ భావన. అందుకే నేను మాట్లాడేది కూడా పర్సనల్ అనుకుంటున్నారు. నేను పర్సనల్ మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడు. మొత్తం రాష్ట్రాన్ని దోచేశారు.

రుషికొండ ను గొరిగేశారు. కొండ లేకుండా చేశారు. మీ నిర్లక్ష్యాన్ని, అవినీతిని మాత్రమే నేను ప్రశ్నించా. మధ్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మారు. ఇది మాట్లాడితే పర్సనల్ అవుతుందా ? ధర స్థిరీకరణ నిది ఎక్కడ అని అడిగితే పర్సనల్ అవుతుందా ? 1750 కోట్ల ముడుపులు అడిగితే పర్సనల్ అవుతుందా ? వివేకా హత్య మీద మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతుంది?

గంగవరం పోర్టు అమ్మేశారు అంటే పర్సనల్ అవుతుందా ? సోషల్ మీడియా లో సైతాన్ సైన్యం గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా ? ఇది సోషల్ ఇష్యూ అని నేను అంటే పర్సనల్ అవుతుందా ? ఏది పర్సనల్… వైసిపి నేతలు సమాధానం చెప్పాలి. మీది సిక్ మైండ్ సెట్. జగన్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు.

నేను ఏపీసీసీ అధ్యక్షురాలు అని నాకు గుర్తుంది. అందరి వైఫల్యాలను ఎత్తి చూపడం నా విధి. ఇది కూడా పర్సనల్ అని అంటే… ఎలా ? సెకి ఒప్పందాల పై మేము వితండవాదం చేయాల్సిన అవసరం లేదు.

రాష్ట్రంలో ఒక కాకినాడ పోర్టు నే కాదు.. అన్ని పోర్టులను రాయించుకున్నారు. కృష్ణపట్నం పోర్టును బలవంతంగా రాయించారు. గంగవరం పోర్టు ను పూర్తిగా అమ్మేశారు. సెకి ఒప్పందాల పై ACB కి పిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ లో ఏ సీనియర్ నాయకుడు నిరుత్సాహం గా లేడు. ఎవరినైనా బయటకు వచ్చారా ? ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. సీనియర్లు అందరు కలసి ఉన్నారు.సంతోషంగా ఉన్నారు. పదవులు పోయిన వాళ్ళు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. పదవులు కోల్పోయిన వాళ్ళు ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఉత్తర ప్రదేశ్ లో రాహుల్, ప్రియాంక గాంధీలను అడ్డుకోవడం దారుణం. సంబల్ లో బీజేపీ అసత్య ప్రచారం చేస్తుంది. 4 గురు ముస్లింలను బీజేపీ పొట్టన పెట్టుకుంది. ఇది చాలా దారుణం. బీజేపీ మత చిచ్చు పార్టీ. మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు.

బీజేపీ కి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. గౌరవం ఉంటే ప్రతిపక్ష నేతను ఎందుకు అడ్డుకున్నారు ? బీజేపీని పాతి పెట్టే రోజు త్వరలో వస్తుంది. రాహుల్ గాంధీని అడ్డుకోవడం apcc తీవ్రంగా ఖండిస్తోంది.

LEAVE A RESPONSE