– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ అభినవ గాడ్సే. నాథూరామ్ కి వారసుడు.
అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే, నేడు బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను, స్వాతంత్య్రపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ మరో హత్య చేస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహపు చర్యనే. ఇది మహాత్మాకు ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం.
పథకానికి “రామ్ – జి” (రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరు పెట్టీ గాంధీజీని అవమానించాలని చూసే కుట్ర. నరేగా పథకాన్ని ఆర్ఎస్ఎస్ స్కీమ్ గా మార్పు చేస్తున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి ఉన్నఫళంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? 100 రోజుల పని దినాల నుంచి 125 రోజుల పెంపునకు గాంధీజీ పేరు మారుస్తారా? మహాత్మా పేరు చెరిపేస్తే ఖర్చు తప్పా.. మోడీకి దక్కే లాభం ఏంటి?
స్వాతంత్య్ర సమరయోధుల మీద, ఈ దేశ మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం? నరేగా పథకానికి పూజ్య బాపూజీ పేరు మార్చాలని చూసే కేంద్రం ప్రయత్నాలను తిప్పికొట్టాలి. దేశం మొత్తం మోడీ తీరును ప్రతిఘటించాలి. రాష్ట్ర ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలి.