Suryaa.co.in

Telangana

24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవి కి రాజీనామా చేస్తా

ఆరు గెరేంటీ లు 100 రోజుల్లో అమలు చేస్తాం
అమలు చేయకపోతే తప్పుకుంటాం
దళితుల ఉసురు కెసిఆర్ కి తగులుతుంది
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

లక్ష ఎకరాల కి పై గా రైతులు వరి పండిస్తున్నారు పడుతున్నారు.కెసిఆర్ ఇచ్చే 1000 వేలు రైతులందరికి రావడం లేదు పడుతున్నారు.కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను నా ఎంపీ పదవి కి రాజీనామా చేస్తాను .. ఎమ్మెల్యే కి కూడా పోటీ చేయను.

24 గంటల కరెంట్ ఇస్తున్నామని నిరూపించకపోతే మీ మంత్రులు రాజీనామా చేయాలి. రాష్ట్రంలో అసలు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారా?ఇప్పుడు కరెంట్ లేకపోతే చేతికొచ్చిన పంట పోతుంది. ఈ 20 రోజులు కరెంట్ ఇవ్వడం చాల ముఖ్యం. మేము ఇచ్చిన ఆరు గెరేంటీ లు 100 రోజుల్లో అమలు చేస్తాం.అమలు చేయకపోతే మేము తప్పుకుంటాం. బిఆర్ఎస్ వాళ్ళు దోచుకుంటున్న వాటిని అరికడితే మేము చెప్పిన పథకాల్ని అమలు చేయవచ్చు.

దళితుల భూములని కెసిఆర్ గుంజుకొని అమ్ముకున్నాడు .. దళితుల ఉసురు కెసిఆర్ కి తగులుతుంది. మా మాటలని కెసిఆర్ , కేటీఆర్ నమ్మకపోతే వాళ్ళని కర్ణాటక కి తీసుకెళతాము. కెసిఆర్ కుటుంబం బంగారు కుటుంబం అయితే .. తెలంగాణ బ్రతకలేని తెలంగాణగా ఐంది. ఉచిత కరెంట్ ఇచ్చి దేశంలో మేము రికార్డ్ సృష్టించాం. తెలంగాణ బాగుపడాలి అంటే కాంగ్రెస్ కి ఓటు వెయ్యండి.

LEAVE A RESPONSE