Suryaa.co.in

Andhra Pradesh

డి.ఎస్పీ చైతన్య ప్రోద్బలంతో వైసీపీ గుండాలు పెట్రేగిపోతున్నారు

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు

తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గూండాలు టిడిపి దళిత నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

ఆయన రాయదుర్గంలో విలేకర్లతో మాట్లాడారు. తాడిపత్రి డి.ఎస్పీ చైతన్య ప్రోద్బలంతో వైసీపీ గుండాలు పెట్రేగిపోతున్నారన్నారు. టీడీపీ దళిత కౌన్సిలర్లనే లక్ష్యంగా చేస్కొని వరుస దాడులకు వైసీపీ మూకలు తెగబడుతున్నాయన్నారు.డి.ఎస్పీ చైతన్య ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు.

కౌన్సిలింగ్ పేరుతో టీడీపీ నాయకులను స్టేషన్ కు పిలిపించి చితకబాదుతున్నారని కాలవ ఆరోపించారు.రెండురోజుల కిందట తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జునపై వైసీపీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా కొట్టారన్నారు.అడ్డొచ్చిన మల్లికార్జున తల్లీచెల్లిపై కూడా దౌర్జన్యం చేశారన్నారు.

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రోద్బలంతో , గతంలో కూడా వైసీపీ గుండాలు కౌన్సిలర్ మల్లికార్జునపై దాడికి పాల్పడ్డారన్నారు. మంగళవారం ఉదయం 33వ వార్డు కౌన్సిలర్ విజయ్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం క్షిణించిన శాంతి, భద్రతలకు ప్రబల సాక్ష్యమన్నారు. తాడిపత్రిలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

టిడిపి స్థానిక ప్రజాప్రతినిధులపై దాడులతో తెలుగుదేశం పార్టీ నాయకులను భయ కంపితులను చేయాలనే దుర్మార్గమైన ఆలోచనలకు వైసీపీ నాయకులు తెరలేపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదా? అని ప్రశ్నించారు.దళిత టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ గూండాలు చేస్తున్న వరుస దాడులకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
తాడిపత్రిలో తెలుగుదేశం కౌన్సిలర్లు, నాయకులపైన జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీ.ని కాలవ శ్రీనివాసులు కోరారు. రాజకీయ దాడులను ప్రోత్సహిస్తున్న డీ.ఎస్పీ చైతన్యను వెంటనే సస్పెండ్ డిమాండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE