Suryaa.co.in

Andhra Pradesh

కంతేరులో దళితులపై వైసీపీ దాడి దుర్మార్గం

-దళితులపై జరిగిన దాడులపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు ?
-జగన్ ని గద్దెనెక్కించిన దళితులే వచ్చే ఎన్నికల్లో జగన్ గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నారు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు

కంతేరులో దళితులపై వైసీపీ దాడి దుర్మార్గం. ఆర్దిక నేరగాళ్ల నుంచి ఆకురౌడీల వరకు అంతా వైసీపీలోనే ఉన్నారు. కళ్లం హరికృష్ణా రెడ్డి వార్డ్ మెంబర్ ఎక్కువ, పోలింగ్ ఏజెంట్ కి తక్కువ.

అలాంటి ఆకురౌడీలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తూ దళితులపై దాడులకు దిగుతున్నారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి కంతేరు దళితులపై దాడి చేస్తారా? దాడికి పాల్పడ్డవారిని విడిచిపెట్టి బాధితులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం?

దళితులపై జరిగిన దాడులపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు ? హరికృష్ణ రెడ్డిని ఇంత వరకు అరెస్ట్ చేయకపోవడం ఏంటి ? నిజాం పాలనలో కూడా జరగని ఘోరాలు వైసీపీ పాలనలో దళితులపై జరుగుతున్నాయి.

వైసీపీ దళిత మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ దాడులు కనిపిచడం లేదా? మారణాయుధాలతో అనంతపురంలో స్వైరవిహారం చేసిన నాడే హరికృష్ణారెడ్డిపై చర్యలు తీసుకుని ఉంటే దళితులపై దాడి జరిగేది కాదు. దళితులపై దాడి చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గత ఎన్నికల్లో జగన్ ని గద్దెనెక్కించిన దళితులే వచ్చే ఎన్నికల్లో జగన్ గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నారు.

LEAVE A RESPONSE