Suryaa.co.in

Andhra Pradesh

నేతన్న నేస్తం-చేనేతకు ఊతం

ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గాలు ఊపిరిపోసుకున్నాయని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ఆదివారం స్పందించారు. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24,000 చొప్పున నాలుగు విడతల్లో రూ.96,000 ఆర్థిక సాయం.

ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. తద్వారా మగ్గాల ఆధునికీకరణ,చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాల మెరగుపడేందుకు దోహదం చేస్తుందని వెల్లడించారు. మగ్గం చప్పుడు ఆగకుండా చేస్తున్న సీఎం జగన్ తమ గుండెచప్పుడు నిలబెట్టారని నేతన్నలు చేబుతున్నారని అన్నారు.

మా నమ్మకం నువ్వే జగన్ ప్రతి ధ్వనించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిటా ‘మా నమ్మకం నువ్వే జగన్ నినాదం’ ప్రతి ధ్వనిచిందని చెప్పారు. సిఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ 1.16 కోట్ల కుటుంబాల పఱరజలు మెగా పీపుల్స్ సర్వేలు తమ మద్దతు చాటి చెప్పారన్నారు. తద్వారా రాష్ట్రంలో 80 శాతానికి పైగా కుటుంబాల ప్రజలు సిఎం జగన్ పాలనకు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతుందని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE