-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో సత్యనారాయణ వ్రతం
-కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగృహం వరంగల్ జిల్లా పర్వతగిరిలో సత్యనారాయణ వ్రతం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు – ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు దంపతులు, వారి కుమారుడు ప్రేమ్ చందర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్రతంలో పాల్గొన్న వారికి, హాజరైన వారికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కెసిఆర్ దేశంలో సమున్నత స్థాయికి చేరుకోవాలని, వారి నాయకత్వంలో రాష్ట్రం, దేశం, పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, కెసిఆర్ కుటుంబం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరకున్నట్లు తెలిపారు.