Suryaa.co.in

Andhra Pradesh Telangana

సాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు

గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది.

ఈ నెల 17వ తేదీ నుంచి రోజుకు 5,500క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని బోర్డుకు సిఫార్ఫు చేసింది. హైదరాబాద్లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్యకమిటీ సమావేశమైంది. సాగర్ కుడికాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించారు

LEAVE A RESPONSE