Suryaa.co.in

Andhra Pradesh Telangana

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. వివిధ రైల్వే స్టేషన్లలో ఆగనున్న పలు ముఖ్యమైన రైళ్లు

– తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా.. పెండింగ్‌లో ఉన్న రిక్వెస్ట్‌లను పూర్తిచేయాలన్న కిషన్ రెడ్డి సూచనకు అంగీకరించిన రైల్వే మంత్రిత్వ శాఖ
– రైళ్ల స్టాప్‌‌లు, రైళ్ల వివరాల వెల్లడి
– త్వరలోనే అమలుకానున్న మార్పులు

సూదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్ల ను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న డిమాండ్లపై.. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చేసిన సూచనకు.. రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది.

తనకు వచ్చిన డిమాండ్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కొంతకాలం క్రితం రైల్వేమంత్రి అశ్విణి వైష్ణవ్ ను కలిసి వివరించారు. ఆయా స్టేషన్లలో.. వివిధ ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు.

దీనిపై అధికారులతో మాట్లాడిన రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్.. తాజాగా ఈ డిమాండ్లకు అంగీకరిస్తూ.. ఆయా రైల్వేస్టేషన్లలో వివిధ ప్రధానమైన రైళ్లను ఆపనున్నట్లు అధికారికంగాప్రకటించారు.

తెలంగాణలో.. బెల్లంపల్లి, సిర్పూర్-కాగజ్‌నగర్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, గద్వాల్ రైల్వే స్టేషన్లలో…
ఆంధ్రపదేశ్‌లో.. పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

LEAVE A RESPONSE