హైదరాబాద్: నాడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవా నికి మొత్తం 8 వేల మందికి ఆహ్వానాలు అందాయి. ఇందులో దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్కి చెందిన లోకో పైలట్ ఐశ్వర్య కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వందేభారత్ రైలులో పనిచేస్తున్నారు. అలాగే మహారాష్ట్రకు చెందిన లోకో పైలట్ సురేఖ యాదవ్కి కూడా ఆహ్వానం అందింది. ఈమె ఆసియాలోనే మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్.