– మంత్రి నారాయణ
రాజధాని అమరావతి పరిస్థితి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేయనున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఆ నివేదిక రావడానికి 2,3 నెలల సమయం పడుతుందన్నారు. మరో 10 రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత వస్తుందని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.