Suryaa.co.in

Telangana

చిన్న జీయర్, ఆనంద సాయిని రేవంత్ ఆంధ్రోడు అనలేదా?

– దాడికి కారణం సీఎం, డీజీపీ దే
– గాంధీ చేసిన దాడి కాదు.. రేవంత్ రెడ్డి చేసిన దాడి
-గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదు?
– నువ్వు సక్కగా మాట్లాడితే అందరూ సక్కగా అవుతారు
– కోకాపేట లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్: ఆంధ్రా నాయకుల మీద రేవంత్ రెడ్డి కపట ప్రేమ వలకబోస్తున్నారు. చిన్న జీయర్ ని, యాదాద్రిని నిర్మాణానికి ప్లాన్ ఇచ్చిన ఆనంద సాయిని ఆంధ్రోడు అన్నడు రేవంత్ రెడ్డి. కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ లో నీ పెత్తనం ఏంటని గాంధీ కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి సమాధానంగానే కౌశిక్ రెడ్డి మాట్లాడారు తప్ప, సెటిలర్ల మీద కౌశిక్ కామెంట్ చేయలేదు.ముందు రెచ్చగొట్టింది గాంధీ. గాంధీ అనే వ్యక్తికి చెప్పిన సమాధానం అది డిఫెన్స్ లో ఉన్న ప్రతిసారి కొత్త డ్రామా చేస్తున్నడు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకున్నడు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం. శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చేసిందంతా చేసి ఇపుడు హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు ? రేవంత్ రెడ్డి , డీజీపీ లు కాదా ..? నిన్న దాడులు ఎందుకు ఆపలేదు?

పోలీసులను అడ్డంపెట్టుకొని మా ఎమ్మెల్యే పై దాడి చేసినపుడు రేవంత్ కు, డీజీపీ కి లా అండ్ ఆర్డర్ గుర్తు రాలేదా? మీరు ఎందుకు నిన్న చర్యలు తీసుకోలేదు డీజీపీ గారు? గాంధీ చేసిన దాడి కాదు, రేవంత్ రెడ్డి చేసిన దాడి. మమ్మల్ని ఈరోజు హౌజ్ అరెస్ట్ చేశారు, నిన్న గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదు? నిన్నటి దాడికి కారణం సీఎం, డీజీపీ దే. చెయ్యాల్సింది చేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మంలో మా మీద దాడి చేస్తే పది రోజులైనా గుండాల మీద కేసులు పెట్టలేదు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్టులు చేస్తరా? గంటల పాటు తప్పి మహబూబ్ నగర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. మమ్మల్ని అరెస్టులు చేస్తారు, హత్యాయత్నం చేసిన అరికపూడి గాంధీని, అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపుతారా?

మాకు నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల పాటు తిప్పి, దాడులు చేసిన వాళ్లను పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించారు. రాచ మర్యాదలు చేశారు. నిన్న జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ అంతా రేవంత్ రెడ్డి. రేవంత్ డైరెక్షన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పాడుచేయొద్దని, పోలీసుల గౌరవాన్ని తగ్గించవద్దని మేము సంయమనం పాటించాం.

మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలను నిన్న సాయంత్రం నుంచి ఎక్కడిక్కడ హౌజ్ అరెస్టులు చేస్తున్నారు. ఫోన్లు చేసి పోలీసు స్టేషన్లకు రావాలని భయబ్రాంతులకు గురి చేస్తున్నరు. ఇంత దుర్మార్గమా? నీ హౌస్ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుందే తప్ప తరగదు. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయి.

విత్తొకటి నాటితే మొక్కొక్కటి మొలుస్తుందా. పైన సక్కగ వుండాల్సిన నీకే వక్ర బుద్ది ఉంటే కింది స్థాయిలో సక్కగా ఉంటారా ? తన అసభ్య ,సంస్కార హీన మైన భాష ను మార్చుకోకుండా యూ ట్యూబ్ చానళ్లకు నీతులు చెబుతున్నాడు. ముందు నువ్వు సక్కగా మాట్లాడితే అందరూ సక్కగా అవుతారు, యదా రాజ తథా ప్రజ అన్నట్లు ఉంది.కోమటి రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బిఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాలని చెప్పడం దారుణం.

తొమ్మిది నెలల్లో పాలన పై కాకుండా పైసల పై దృష్టి పెట్టడం వల్లే శాంతి భద్రతలు పాతాళానికి పోయాయి. మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారానూ, చిట్ ఛాట్ లలో చెప్పడం ద్వారానో శాంతి భద్రతలు అదుపులోకి రావు. సీఎం నోరు అదుపులో పెట్టుకోక బజారు భాష మాట్లాడుతున్న తీరు, రాగ ద్వేషాలు పెంపొందించేట్టుగా చేస్తున్న వ్యవహారాలు, రాష్ట్రంలో ప్రశాంతతను మంట గలుపుతున్నాయి.

ఫిరాయింపుల పై ఢిల్లీలో ఒక్క మాట గల్లీ లో ఒక్క మాట మాట్లాడుతున్నాడు. ఎన్నికే లేకున్నా పి ఎస్ సి చైర్మన్ను నియమించి ఎన్నిక జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం దుర్మార్గం. అన్నిటి మీద రేవంత్ ది యూ టర్న్ రాజకీయమే. చెప్పేదొకటి చేసేదొకటి. సీఎం డ్రామాల తోనే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటున్నది.
మా మీద ఉన్న కక్ష తెలంగాణ మీద చూపకు. కూర్చున్న చెట్టును నరికేయకు.

అన్నిట్లో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ ను నీ నియంతృత్వ పోకడలతో నిర్వీర్యం చేయకు రేవంత్. డీజీపీ పదవి చాలా ఉన్నతమైంది. ఆదర్శంగా ఉండాల్సిన డీజీపీ రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడటం దుర్మార్గం. పోలీసుల పట్ల గతంలో రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అందరికి తెలిసిందే. ఎలా బండ బూతులు మాట్లాడిండో అందరికి తెలుసు.

గుడ్డిగా రేవంత్ రెడ్డిని ఫాలో కావొద్దని, విచక్షణతో పని చేయాలని, చట్టం ప్రకారం నడుచుకోవాలని డీజీపీ ని, పోలీసులను కోరుతున్నాను. రాహుల్ గాంధీ దేశం బయట స్వేచ్ఛ స్వాతంత్య్రాల గురించి లెక్చర్లు ఇవ్వడం కాదు. నీ పార్టీ కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ లో ప్రజల పై విధిస్తున్న ఆంక్షల మీద మాట్లాడు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, పీఏసీ నియామకం కానీ రాజ్యంగ ఉల్లంఘనలు. దీని నుంచి దృష్టి మరల్చేందుకు వ్యక్తుల మధ్య కొట్లాటలాగా చేస్తున్నరు. దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల సమస్య మీద నుంచి దృష్టి మరల్చుతున్నడు. హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారు. వరద బాధితులకు సాయం చేయకుండా మీ మీద దాడి చేయించాడు. రైతు బంధు గురించి అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టు అంటడు. డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి.

పోరాటాలు, కొట్లాటలు మాకు కొత్త కాదు. ఖమ్మం, హైదరాబాద్ లో మిమ్మల్ని మీరు రాళ్లతో కొట్టవచ్చు. మీరు విసిరే రాళ్లే అధికారంలోకి బిఆర్ఎస్ రావడానికి పునాది రాళ్లు అవుతాయి జాగ్రత్త.

16వ ఆర్థిక సంఘం గురించి మీరు తప్పుడు లెక్కలు చెబితే, మేము బాధ్యతాయుతంగా బలమైన వాదనను వినిపించాం. నీటి ప్రాజెక్టులకు, మిషన్ భగీరథకు, రాష్ట్ర అభివృద్దికి నిధులు కావాలని కోరాం. రాజకీయం కాదు, రాష్ట్రం ముఖ్యమని భావించి వాస్తవాలు లెక్కల రూపంలో చెప్పాం. 16వ ఆర్థిక సంఘాన్ని సాయం కోరాం.

పీఏసీకి ఎన్నిక జరిగిందని నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నిక పెట్టాలి కానీ, జరగలేదు. ఏ రోటికాడ ఆ మాట మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి. ఆదానికి ఓల్డ్ సిటీ అప్పజెప్పుతానని మాట మార్చిండు. తొక్కిసలాటలో భుజం నొప్పి మొదలైంది. ఎమ్మారై స్కాన్ తీసి 15 రోజుల పాటు ఫిజియోథెరపీ సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ బిఆర్ఎస్ నాయకులను అరెస్టులను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మహిళలని చూడకుండా అరెస్టులు చేయడం దుర్మార్గం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE