హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. వీరిద్దరూ ఆయా పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
కోఠి మహిళా యూనివర్సిటీ ఇంఛార్జి వీసీగా ధనావత్ సూర్య, బాసర ట్రిపుల్ ఐటీ ఇంఛార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ను నియమించారు.