– నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలి
– బెల్లామ్ లో జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన.. సిడబ్ల్యుసి తీర్మానం
– జనగణన లో కులగణన చేయాలని సీఎం రేవంత్ ప్రతిపాదనకు ఆమోదం
బెల్లామ్: దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుందని, అందువల్ల ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలని అన్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా , అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
చట్ట సభలలో మహిళ బిల్లు ను కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి ఒక కొలిక్కి తెచ్చిన నేపథ్యంలో ఆ బిల్లు పై మనం ఎక్కవగా ప్రచారం చేయాలని అన్నారు. బీజేపీ మహిళ బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
కులగణన తెలంగాణ లో దేశంలోనే మార్గదర్శిగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణన లో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలని అన్నారు. ఈ విషయంలో సిడబ్ల్యుసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించగా రేవంత్ రెడ్డి ప్రతిపాదనను సిడబ్ల్యుసి తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది.
కులగణన తో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సరిగ్గా వంద ఏళ్ల క్రితం ఇదే బెల్లామ్ లో మహాత్మా గాంధీ ని సిడబ్ల్యుసి ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నుకున్నదని, తర్వాత ఆయన ఏ ఒక్క పదవి చేపట్టనున్న కూడా ప్రపంచ వ్యాప్తంగా గాంధీ ని ఆచరిస్తారని అందుకు ఆయన చెప్పిన సిద్ధాంతాలు, విధానాలే కారణమని అన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనలతో చేపట్టాలని నిర్ణయించిన కులగణన తో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఇది దేశం అంత స్వాగతించాల్సిన అంశమని అన్నారు. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదని అన్నారు.
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభించిందని, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ కులగణన అత్యంత పకడ్బందీగా అన్ని వర్గాల ఆలోచనలను స్వీకరించి ఒక అద్భుతమైన ప్రశ్నావళి రూపొందించి సర్వే చేయడం జరిగిందని, ఇప్పటికే 90 శాతం కులగణన పూర్తయిందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని, చరిత్ర ను తిరగరాయలని చూస్తున్నదని, ఇలాంటి తరుణంలో దేశానికి సేవలు, త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర కారుల, త్యాగ పురుషుల జీవితాలను నేటి తరానికి వివరించాలని సూచించారు.