– ఆంధ్రా బ్యాంకుకు సీఎం రమేష్ 70 కోట్లు ఎగ్గొట్టారు
– ఈడీ దాడులు జరిగితే భయపడి బీజేపీలో చేరారు
– కంచెగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సీఎం రమేష్ బ్రోకర్
– సీఎం రమేష్ పై గతంలో జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫోర్జరీ కేసు
– బీ ఆర్ ఎస్ ఖైరతాబాద్ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రమేష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాము.బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేష్ అబద్దాలు చెప్పారు. సారా వ్యాపారంతో సీఎం రమేష్ వందలకోట్లు సంపాదించారు.ఫోర్జరీతో సీఎం రమేష్ బ్యాంకులకు 450 కోట్లు ఎగ్గొట్టారు. సీఎం రమేష్ టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా వుండి ఈడీ దాడులు జరిగితే భయపడి బీజేపీలో చేరారు.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎప్పుడో వచ్చింది. సీఎం రమేష్ కేటీఆర్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. రేవంత్ రెడ్డి స్క్రిప్టును సీఎం రమేష్ చదువుతున్నారు. ఫోర్త్ సిటీలో సీఎం రమేష్ కు రేవంత్ రెడ్డి 1600 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉన్న బీజేపీలో బిఆర్ఎస్ విలీనం కాదు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బ్రోకర్ గా సీఎం రమేష్ ఉన్నారు
పది సంవత్సరాల్లో తెలంగాణపై కన్నెత్తి చూడని వాళ్ళు తెలంగాణపై పెత్తనం చేస్తున్నారు. తెలంగాణను 20మంది సీమాంధ్ర పెట్టుబడుదారులు దోచుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టుల కోసం సీఎం రమేష్ బిఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నార. సీఎం రమేష్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి. సీఎం రమేష్ మరోసారి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
సీఎం రమేష్ పై గతంలో జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫోర్జరీ కేసుఉంది. సీఎం రమేష్ మాట్లాడగానే బండి సంజయ్ కేంద్రమంత్రి అని విలువలు లేకుండా మాట్లాడుతున్నారు. తన షెల్టర్ కోసం సీఎం రమేష్ బీజేపీ ఆశ్రయం పొందారు. హైదరాబాద్ లో మంచిగా ఉండాలంటే, హైదరాబాద్ లో తిరగాలంటే సీఎం రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి.