– పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరు: ప్రభుత్వం వివిధ వర్గాలలోని అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదములు… సామాన్యులు, మధ్యతరగతి వస్తువులపై జీఎస్టీని 18 లేదా 12% నుండి 5% తగ్గించి ఈ నెల 22 నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుండడం ఆనందకరమని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బు, సబ్బు బార్లు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్టు, సైకిళ్ళు, టేబుల్వేర్, కిచెన్వేర్, ఇతర గృహోపకరణాలు వంటి వస్తువులపై ఇప్పుడు 5% GST మాత్రమే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా రామన్ తెలిపారన్నారు.
అల్ట్రా-హై టెంపరేచర్ పాలు, చైనా, పనీర్, భారతీయ బ్రెడ్ ల మీద ఉన్న GSTని 5% నుండి 0% తగ్గించడం డెయిరీ రంగానికి మంచి సహకారమేనని, నమ్కీన్, భుజియా, సాస్లు, పాస్తా, ఇన్స్టంట్ నూడుల్స్, చాక్లెట్లు, కాఫీ, సంరక్షించబడిన మాంసం, కార్న్ఫ్లేక్స్, వెన్న, నెయ్యి వంటి ఆహార పదార్థాలపై జీఎస్టీని 12% లేదా 18% నుండి 5% తగ్గించడం శుభపరిణామమన్నారు.