– అందె శ్రీ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నాం
– ఆయన పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు
– అందె శ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అందె శ్రీ నాకు అత్యంత అప్తుడు..నా మనసుకు దగ్గరి వాడు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. ఎంత అమాయకంగా కనిపించినా, అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారు. నిజాం కు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలింది. సమైక్యవాదులకు వ్యతిరేకంగా గద్దర్ ,గూడా అంజన్న, అందె శ్రీ, గోరేటి వెంకన్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారు. బడి మొహం ఎరుగని అందె శ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారు.
ప్రతి తెలంగాణ గుండె కు జయ జయహే తెలంగాణ పాటను అందె శ్రీ చేర్చారు. జయ జయ హే తెలంగాణ పాట ను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారు. కానీ ఆ నాటి పాలకులు జయ జయ హే తెలంగాణ పాట మూగబోయింది. అధికారం శాశ్వతం అని వారు ఆ నాడు భావించారు. తెలంగాణ లో స్పూర్తిని నింపిన కవులు, కళాకారుల గానం తెలంగాణలో వినిపించకుండా కుట్ర చేశారు. పెన్నులపైన మన్ను కప్పితే గన్ను లై మొలకెత్తుతాయని , గడీలను కూల్చుతాని అందె శ్రీ నిరూపించారు.
ఇప్పుడు తెలంగాణ నాలుగుకోట్ల ప్రజలు జయ జయ హే తెలంగాణ పాటను నిత్యం పాడుకుంటున్నారు. అందె శ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత. తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్,అందె శ్రీ కోరుకున్నారు. అందె శ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం.. అందె శ్రీ స్మ్రుతి వనాన్ని నిర్మిస్తున్నాం, ఆయన పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చాం. భారత్ ప్యూచర్ సీటీలో వారికి ఇంటిని నిర్మించి ఇస్తాం. దేశంలో వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. వర్గీకరణ అమలు వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు అవుతున్నారు. నా మంత్రి వర్గంలో నలుగురు దళితులు మంత్రులుగా ఉన్నారు. కవులు ఎంత మంది ఉన్నా తెలంగాణ చరిత్రలో అందె శ్రీ ఒక కోహినూర్ వజ్రంలా నిలిచిపోతారు.

