Suryaa.co.in

Andhra Pradesh

సెప్టెంబర్ 1 విద్రోహ దినం.. కలెక్టరేట్‌ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన

-ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి
– ఏపీఎన్జీవో డిమాండ్‌

అమరావతి : ఉద్యోగుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తామని ఏపీఎన్జీవో ప్రకటించింది. సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించినా అరెస్టు చేయటం అన్యాయమని మండిపడింది. ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు.
సీపీఎస్‌ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు, బెదిరింపులు, బైండోవర్‌ చేయడం తగదని ఏపీఎన్జీవో హితవు పలికింది.

ఉద్యోగులపై ప్రభుత్వం పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. సెప్టెంబర్‌ 1న విద్రోహ దినంగా పాటిస్తామని స్పష్టం చేసింది.

సీఎం జగన్‌ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నా అరెస్ట్‌ చేయడం అన్యాయమని.. రేపు కలెక్టరేట్‌ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని వెల్లడించింది. సీపీఎస్‌ రద్దు చేసేవరకు పోరాటం ఆగదని ఎన్జీవో సంఘం స్పష్టం చేసింది. సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదని ఎన్జీవో సంఘ నేతలు హెచ్చరించారు.

LEAVE A RESPONSE