Suryaa.co.in

Telangana

మతతత్వ పార్టీలకు చెక్ పెట్టాలంటే కె.సిఅర్ లాంటి నాయకుడు అవసరం

– తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

దేశంలో మతతత్వ పార్టీలకు చెక్ పెట్టాలంటే కె.సిఅర్.లాంటి నాయకుడు అవసరం. దేశం లో రోజు రోజుకు దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి విదేశీ మారక నిలువలు తగ్గిపోతున్నా, కేంద్రం లోని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.దేశంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, కానీ వాటిని అదుపు చేసే శక్తి కేంద్రం లోని మోడీ ప్రభుత్వానికి చేత కావడం లేదు. కానీ బలవంతంగా తెలంగాణ లోని మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నిక తేవడం, వందలాది కోట్లు ఖర్చు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే.దేశం పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా, అవేమీ పట్టిచుకోకుండా గత మూడు నెలలుగా కేంద్ర మంత్రులంతా తెలంగాణా మరియు మునుగోడు చుట్టూ తిరుగుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఇది దేశ సమగ్రత కు మంచిది కాదు.ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివ్రుద్ది కార్యక్రమాలే తెరాస అభ్యర్థినే భారీ మెజార్టీతో మునుగోడు ప్రజలు గెలిపిస్తారు.

LEAVE A RESPONSE