Suryaa.co.in

Telangana

దేశం, రాష్ట్రం, పాల‌కుర్తి నియోజ‌కవ‌ర్గం సుభిక్షంగా ఉండాలి

-మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇంట్లో స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం
-కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పాల్గొన్న మంత్రి

రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్వ‌గృహం వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలో స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం జ‌రిగింది. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు – ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావు దంప‌తులు, వారి కుమారుడు ప్రేమ్ చంద‌ర్‌ రావు దంప‌తులు, కుటుంబ స‌భ్యులు ఈ వ్ర‌తంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వ్ర‌తంలో పాల్గొన్న వారికి, హాజ‌రైన వారికి తీర్థ ప్ర‌సాదాలు అంద‌చేశారు. అనంత‌రం విందు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, కెసిఆర్ దేశంలో స‌మున్న‌త స్థాయికి చేరుకోవాల‌ని, వారి నాయ‌క‌త్వంలో రాష్ట్రం, దేశం, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా నిలవాల‌ని, కెసిఆర్ కుటుంబం ఆయు ఆరోగ్యాల‌తో ఉండాల‌ని కోర‌కున్న‌ట్లు తెలిపారు.

LEAVE A RESPONSE