– మంత్రి కేటీఆర్
చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. “ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. అసలైన ఫలితాలు మాకు శుభవార్తలు చెబుతాయి” అని కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం పోలింగ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 88 సీట్లు వస్తాయని భావించామని.. వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.