Suryaa.co.in

Andhra Pradesh

కూటమి అభ్యర్ధులు గెలవాలి

చినవెంకన్న సన్నిధిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి
ద్వారకా తిరుమల నుండి ప్రచారం ప్రారంభం

ద్వారకాతిరుమల : కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ద్వారకాతిరుమల చిన్న వెంకన్న దేవస్థానంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. రాజమండ్రి ఎంపి అభ్యర్ధిగా ఇక్కడి నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలో పోటీకి ఎంపిక చేసిన అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థుల కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చడం ద్వారా రాష్ట్రంలో మార్పును ప్రజలందరూ కోరుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే దేవస్థానం సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగించకుండా, కేవలం భక్తుల సౌకర్యార్థం వారిని ఆలయాలకే పరిమితం చేయాలని ఎన్నికల కమిషన్ ని ఈ సందర్భంగా కోరుతున్నట్లు ఆమె తెలిపారు.

ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆలయమర్యాదలతో స్వాగతంపలికారు. రాజమండ్రి ఎంపీ గా పోటీ నేపథ్యంలో ఎన్నికల పర్యటనల ముందు చిన వెంకన్న దర్శనం చేసుకున్నారు. శ్రీవారు, అమ్మవార్లను దర్శించి, పురంధేశ్వరి ప్రత్యేకపూజలుచేశారు నేటి నుండి వరుసగా 4 రోజులు రాజమండ్రి లో బస చేసి కూటమి నేతలతో సమావేశాల్లో పురంధేశ్వరి పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE