Suryaa.co.in

Andhra Pradesh

ఖమ్మం లో అమిత్ షా బహిరంగ సభ వాయిదా

అతి త్వరలోనే ఖమ్మంలోనే బహిరంగ సభ నిర్వహిస్తాం
ప్రధాని బహిరంగ సభను కూడా ఖమ్మంలోనే నిర్వహించాలని భావిస్తున్నాం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

గుజరాత్, మహారాష్ట్రలో భారీ ఎత్తున వర్షాలు వస్తుండటంతో రేపు ఖమ్మం లో అమిత్ షాబహిరంగ సభను వాయిదా వేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 గంటలపాటు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున అనివార్య కారణాలవల్ల బహిరంగ సభకు రాలేకపోతున్నారు.ఎన్డీఆర్ఎఫ్ దళాలను ఇప్పటికే తుఫాన్ బాధిత ప్రాంతాలకు పంపారు. రైళ్లన్నీ రద్దు చేశారు. దాదాపు 50 వేల మందిని ఆ ప్రాంతాల నుండి తరలించారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని రేపటి పరిస్థితిని అంచనా వేశాం. ఈ విపత్కర సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సముచితం కాదనే నిర్ణయానికి వచ్చాయి.వాస్తవానికి బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. పార్టీ సీనియర్ నేతలంతా అక్కడే మకాం వేశారు. పెద్ద ఎత్తున జనం వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అతి త్వరలోనే ఖమ్మంలోనే బహిరంగ సభ నిర్వహిస్తాం.ప్రధాని బహిరంగ సభను కూడా ఖమ్మంలోనే నిర్వహించాలని భావిస్తున్నాం. కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దు. ప్రజలను కలవండి.

 

LEAVE A RESPONSE