Suryaa.co.in

Andhra Pradesh Sports

చండీఘర్ పై ఆంధ్రా కబడ్డీ జట్టు ఘన విజయం

-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో బాలికల జట్టు బోణి
-40 – 28 స్కోర్ తో ఆంధ్రా పైచేయి

హర్యానాలో ఈ నెల 3వ తేది నుండి 13వ తేది వరకు జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021-22 లో భాగంగా ఈ రోజు బాలికల కబడ్డీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ టీమ్ 40 – 28 స్కోర్ తో చండీఘర్ టీంపై ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా శాప్ వి.సి & యం.డి డా. నక్కల ప్రభాకర రెడ్డి జట్టు సభ్యులకు, శాప్ కోచ్ సంధ్య, టీమ్ మేనేజర్ శైలజకు శుభాకాంక్షలు తెలియజేశారు… తదుపరి జరగబోయే అన్ని మ్యాచ్ లలో ఆంధ్రా బాలికల జట్టు విజయం సాధించాలని శాప్ ఎండీ ఆకాంక్షించారు. ఖేలో ఇండియా గేమ్స్ లో పాల్గొంటున్న టీమ్ లకు ఖేలో ఇండియా చీఫ్ ద మిషన్ యల్. దేవానందం, నోడల్ అధికారిణి జూన్ గాల్ల్యొట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు .

LEAVE A RESPONSE