Suryaa.co.in

Andhra Pradesh

మేమేమైనా బాంబులు వేస్తామా?

– అంగన్వాడీ కార్యకర్తల ఆగ్రహం

మేమేమైనా బాంబులు వేస్తామా మమ్మల్ని దొంగల్లా ఎందుకు చూస్తున్నారు అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కృష్ణాజిల్లా అవనిగడ్డలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మూడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అవనిగడ్డ సంఘ నాయకులు జి. సుశీల, ఎం. కాశీ హంస మాట్లాడుతూ న్యాయమైన కోర్కెల సాధనకు, ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన హామీల ప్రకారం నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని శాంతియుతంగా ధర్నా చేసేందుకు విజయవాడ వెళుతుంటే, రెండు రోజులుగా తమ ఇళ్ల వద్ద అర్ధరాత్రి వేళ మగ పోలీసులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపలా పెట్టి తమకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని, తమ విధులకు కూడా తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తామేదో ఎవరి సొమ్ము దోచుకోవటానికి వెళ్లట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE