Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడు భిక్షతో రాజకీయాలలోకి వచ్చిన సన్నాసులు.. లోకేష్ ని తిడుతున్నారు

– వంశీకి పార్టీలో చోటు ఇవ్వకపోతే వంశీ పేరు, వంశీ ముఖం గన్నవరం ప్రజలకు కూడా తెలియదు
– కొడాలి, వల్లభనేని మూలాలు మర్చిపోయి బూతులు మాట్లాడటం సిగ్గుచేటు
– క్యాసినో, కోడి పందేలు, జూదానికి జిల్లాను అడ్డగా మార్చారు
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారి కార్యాలయం నందు గురువారం నాడు నారా లోకేష్ పై అనుచిత వ్యాఖలు చేస్తున్న వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి కళ్ళల్లో పైశాచిక ఆనందాన్ని చూడటానికి కృష్ణ జిల్లా పరువు తీసిన వంశీ, వెల్లంపల్లి, కొడాలి నాని, పేర్ని నాని,దేవినేని అవినాష్ వీరందరూ చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

వల్లభనేని రమేష్ కు ఇద్దరు కొడుకులు…వీళ్లు ప్రక్కన ఇంటి వాళ్లకు కూడా తెలియదు. వీళ్లలో వల్లభనేని వంశీని విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు చెప్పేవరకు ఎవరికీ తెలియదు.

2009లో చంద్రబాబు నాయుడు వంశీకి పార్టీలో చోటు ఇవ్వకపోతే వంశీ పేరు, వంశీ ముఖం గన్నవరం ప్రజలకు కూడా తెలియదు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షతో ఈ స్థాయిలో ఉన్న కొడాలి, వల్లభనేని మూలాలు మర్చిపోయి బూతులు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు..

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాధారణ చూసి తట్టుకోలేని ప్యాలెస్ పిల్లి, వైసీపీ నేతలతో అడ్డమైన మాటలన్నీ మాట్లాడిస్తున్నాడు. గుడివాడ కొడాలి,వంశీ కలిసి జిల్లాను దోచుకుంటున్నారు..వీటికి తోడు క్యాసినో, కోడి పందేలు, జూదానికి జిల్లాను అడ్డగా మార్చారు.

2024 ఎన్నికల్లో ప్రజలు మీ బూతులకి పోలింగ్ బూత్ లలో సమాధానం చెబుతారు, వైసీపీ పార్టీని వైసీపీ పార్టీ నేతలను తరిమి తరిమి కొడతారు, మిమల్ని రాజకీయ భూస్థాపితం చేస్తారు.

LEAVE A RESPONSE