-శాకాంబరీ దేవి అలంకారంతో దర్శనం ఇచ్చిన శ్రీ వాసవి అమ్మవారు
-వాసవి అమ్మవారికి గోరింటాకు ,సారె సమర్పించిన శిద్దా లక్ష్మీ పద్మావతి
-అమ్మవారి ఆషాడ మ్రొక్కులు తీర్చుకున్న మహిళా భక్తులు
ఆశాడమాసం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో జరిగిన గోరింటాకు పండగ, మరియు శాకాంబరీ అలంకారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీమంత్రి శ్రీ శిద్దా రాఘవరావు సతీమణి శ్రీమతి శిద్దా లక్ష్మీ పద్మావతి,శిద్దా సుధీర్ కుమార్ నేతృత్వంలో జరిగిన గోరింటాకు పండుగలో అమ్మవారి శాకాంబరీ అలంకారంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మర్చిపోయిన మన హిందు పండగ సాంప్రదాయాలను నేటి తరాలకు గుర్తు చేస్తూ శ్రీమతి లక్ష్మీ పద్మావతి ఈ వేడుకలు వైభవంగా నిర్వహించి హిందు పండగ విశిష్టతను, సంప్రదాయాలను చాటి చెప్పారు. ఆశాడమాసం శుక్రవారం జరిగిన గోరింటాకు పండుగ,శాకాంబరీ అలంకారం సందర్భంగా చీమకుర్తి, దర్శి మార్కాపురం, ఒంగోలు తదితర ప్రాంతల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు
గోరింటాకు పండగ విశిష్టతను గురించి తలియచెప్పే రీతిలో పండగ నిర్వహించడం విశేషం.ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ హరిహర క్షేత్రంలో వేంచేసివున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకాలు,విశేష కుంకుమ అర్చన విశేష పూల అలంకారాలు నిర్వహించారు. అనంతరం గోరింటాకు తో శ్రీ వాసవి అమ్మవారి అలంకరణ,మరియు శాకాంబరీ అలంకారంతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.శాకాంబరీ దేవి అలంకారంతో శ్రీ వాసవి అమ్మవారు నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు..
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు,శిద్దా సుధీర్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు.
ఆశాడమాసం సందర్భంగా చిమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం జరిగిన శ్రీ వాసవి అమ్మవారి ఆషాడ గోరింటాకు పండగ మరియు శాకాంబరీ అలంకారం సందర్భంగా మాజీమంత్రి శిద్దా రాఘవరావు ,శ్రీమతి శిద్దా లక్ష్మీ పద్మావతి దంపతులు క్షేత్రంలో వేంచేసివున్న సర్వ దేవతలకు విశేష పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.వివిధ రకాల,కూరగాయలతో ,అమ్మవారికి ఇష్టకరమైన పదార్థాలతో పాటు శ్రీమతి శిద్దా లక్ష్మీ పద్మావతి,సువాసినిలతో కలసి గోరింటాకు స్వయంగా రుబ్బి అమ్మవారికి చీర, రవికే, గాజులు, పసుపు,కుంకుమ,పండ్లు 108 రకాల పదార్థాలు అమ్మవారికి సమర్పించారు.అనంతరం అమ్మవారి మహా హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి కీర్తనలను,కోలాటం, భజనలు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో సాక్ష్యాత్తూ పెనుగొండ శ్రీ వాసవి అమ్మవారి క్షేత్రం తలపించింది,జై వాసవి నినాదంతో శ్రీ హరిహర క్షేత్రంలో భక్త జనసంద్రంగా మారింది.పూజ కార్యక్రమం అనంతరం శ్రీమతి శిద్దా లక్ష్మీ పద్మావతి ముత్తైదువులకు పసుపు కుంకుమ,గాజులు,ప్రసాదాలు అందచేశారు.
ఈ వేడుకలలో శిద్దా పాండురంగారావు దంపతులు, శిద్దా వెంకటేశ్వర్లు, శిద్దా పెద్ద బాబు,శిద్దా సుధాకర్ దంపతులు, శిద్దా సాయి బాబు దంపతులు, శిద్దా ప్రసాద్, శిద్దా బాలాజీ దంపతులు, శిద్దా జయశ్రీ,శిద్దా పుష్పాలత,శిద్దా జయభారతి, ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు సువర్ణ,పల్లపోతు పద్మ,అరుణ,ఆర్యవైశ్య వాసవి మహిళా సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.శిద్దా వెంకటేశ్వర్లు,శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు,ఉచిత బస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ,హరి కుమారా చార్యులు, హరికృష్ణ శర్మ తదితరులు భక్తులకు తీర్థప్రసాదాలు అందచేసారు.