మానవునికి వున్న ఎనిమిది అంగాలతో : ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం, కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ నమస్కారం చేయడం అని అర్ధము.
1. “ఉరసా ” అంటే ఛాతి అని అర్థం.
2. “శిరసా ” అంటే తల అని అర్థం.
3. “దృష్ట్యా ” అనగా కళ్ళు అని అర్థం.
4. “మనసా ” అనగా హృదయం అని అర్థం.
5. “వచసా ” అనగా నోరు అని అర్థం.
6. “పద్భ్యాం ” అనగా పాదములు అని అర్థం.
7. “కరాభ్యాం ” అనగా చేతులు అని అర్థం.
8. “కర్ణాభ్యాం ” అంటే చెవులు అని అర్థం.
మానవుడు సహజంగా ఈ 8 అంగాలతోనే తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయాల్లో బోర్లా పడుకుని అష్టాంగoతో చేసిన తప్పు లను క్షమించమని వేడుకుంటారు. నమస్కారం చేసేటపుడు ఉరస్సుతో – ఛాతి, శిరస్సుతో – నుదురు, దృష్టితో – కనులు రెండు మూ సుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని తలుచుకోవాలి, మనస్సుతో – మనస్పూర్తిగా, వచసా – అంటే ఇష్ట దైవాన్ని స్మరించాలి, పద్భ్యాం – అంటే రెండు పాదాలు నేలకు, కరాభ్యాం – అంటే రెండు చేతులు, జానుభ్యాం – అంటే రెండు మోకాళ్ళు నేలకు తగులుతూ నమస్కారం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.
సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్య లో కాకుండా ధ్వజస్తంభం వెనుక వుండి చేయాలి. పూజ పూర్తయిన తరు వాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించు కునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యా లి. దైవానికి, గురువు లుకు, యతులుకు సాష్టాంగనమ స్కారం చేయాలి. నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొంద లేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం..
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు, కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని మన శాస్త్రం చెబుతుంది స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే పొట్ట నేలకు తాకుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. పాలిచ్చి పోషించే వక్ష స్థలం కూడా నేలకు తాకుతాయి. ఇలా చేయడం వల్ల ఏదైనా జరగరానిది జరిగే అవకాశం ఉంది. మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది. సృష్టికి ఆధారమైన, పోషణకు ఆధారమైన స్థలం నేలకి తాకకూడదు. అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు.
– ఎంఆర్ఎన్ శర్మ