Suryaa.co.in

Telangana

రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం

– కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డు చెప్పడం సరికాదు. ఉద్యమ సమయంలోను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక సందర్భాలలో క్లాక్ టవర్ వద్ద అన్ని వర్గాలు ఆందోళన చేసిన విషయం కాంగ్రెస్ మంత్రులు మరిచిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడే దీక్ష చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలి.

రైతు భరోసా ఎకరానికి 15000 వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు ఎలాంటి సహాయం చేయని ప్రభుత్వం ఎకరానికి 12000 కు తగ్గించి రైతులను దగా చేస్తున్నది, రుణ మాఫీ, బోనస్ విషయంలో రైతులకు కోతలు విధించినట్లు గానే రైతు భరోసా కొంత మందికి ఇచ్చి,వ్యవసాయ యోగ్య పేర ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి విధానాలకు నిరసనగా బి ఆర్ ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రైతుల ధర్నా కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనడం ప్రభుత్వం లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఏడవ గ్యారెంటీ గా ఇచ్చిన ప్రజాస్వామ్య పరిరక్షణ హామీ తుంగలో తొక్కి రాష్ట్రం లో హామీలు అమలు చెయ్యి అని అడిగిన ప్రజల పై అక్రమ నిర్బంధాలు కేసు నమోదు చేసి భావ ప్రకటన స్వేచ్ఛను హా రిస్తున్నారు,చివరకు అక్రమ మైనింగ్ ను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి మద్దతుగా వెళుతున్న పౌర హక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, హరగోపాల్ లాంటి నేతలను అరెస్ట్ చేసి నిర్బంధించడం దారుణం.

LEAVE A RESPONSE