రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీత దంపతులకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గీత హైకోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన న్యాయస్థానం సీబీఐ కోర్టు తీర్పును నిలిపివేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 16 కి వాయిదా వేసింది.