Suryaa.co.in

Andhra Pradesh

కాటసాని రామిరెడ్డిని ఒంటిపై అంగీ లేకుండా పరిగెత్తిస్తా

-నా కంటిరెప్ప వెంట్రుక కూడా రామిరెడ్డి కదపలేడు
-రామిరెడ్డి వచ్చి నాఇంట్లో బట్టలు ఉతుకుతాడా?
-రామిరెడ్డి నా నాలుకకోస్తే, నేను అతనివన్నీ కోస్తా
-మాజీ ఎమ్మెల్యే బీ.సీ.జనార్ధన్ రెడ్డి

“యువగళం పాదయాత్రలో భాగంగా నారాలోకేశ్ బనగానపల్లెకు వచ్చినప్పుడు, రాష్ట్రంతోపాటు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని, స్థానికవైసీపీ ఎమ్మెల్యే దుర్మార్గాలను ప్రజలకు తెలియచేశారు. లోకేశ్ బహిరంగంగా ప్రజలతో మాట్లాడినదానిపై కాటసాని రామిరెడ్డిని కమీషన్ల రామిరెడ్డి అన్నారుతప్ప, వ్యక్తిగతదూషణలు చేయలేదు. లోకేశ్ తన అవినీతిపై ప్రశ్నించాడన్న అక్కసుతోనే రామిరెడ్డి మా యువనాయకుడిని అసభ్యంగా దూషించాడు.

రామిరెడ్డిని ఉద్దేశించి నేనుకూడా “నీయబ్బ నువ్వుఎన్నిఎకరాల వాడివి, నీకుఇంతడబ్బు ఎక్కడినుంచి వచ్చిందిరా నాకొ..!” అని నేను అంటే వ్యవహారం ఎంతదూరంపోతుందో చెప్పాల్సిన పనిలేదు. రామిరెడ్డికి రాజకీయభిక్షపెట్టిందే తెలుగుదేశంపార్టీ. టీడీపీ భిక్షతో నేడు ఎమ్మెల్యేగా గెలిచిన రామిరెడ్డి, నేడు చంద్రబాబునాయుడిని, ఆయన కుటుంబాన్ని దూషించడం తల్లిపాలుతాగి రొమ్ము గుద్దడమే. గతంలో చంద్రబాబునాయుడి ప్రాపకంకోసం ఆయనచుట్టూతిరిగి, ఆయన్ని హెలికాఫ్టర్లో తీసుకొచ్చి, తనభార్యతో హారతులుఇప్పించి, చంద్రబాబుస్వామి..చంద్రబాబుస్వామి మాకు రాజకీయభిక్ష పెట్టు అని వేడుకున్నాడు.

చంద్రబాబు దయాదాక్షిణ్యంతోనే రామిరెడ్డి నేడు ప్రత్యక్షరాజకీయాల్లో మనగలుగుతున్నాడు. రామిరెడ్డి అల్లుడికి కూడా చంద్రబాబే రాజకీయభిక్షపెట్టాడు.జగన్మోహన్ రెడ్డిని, వైసీపీవాళ్లను రామిరెడ్డి అల్లుడు ఏమంటున్నాడో, లోకేశ్ కు ఎలా అండగా ఉంటున్నాడో ప్రజలు చూస్తూనేఉన్నారు. లోకేశ్ యువగళం యాత్రతో జగన్ కు, వైసీపీనేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయన్న తనఅల్లుడి వ్యాఖ్యలపై రామిరెడ్డి ఏంసమాధానం చెబుతాడు?

నాకు బట్టలులేకుండా ఉరికిస్తానని, నా సంగతి తేలుస్తానని రామిరెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన నన్నుఎలా ఉరికిస్తాడో తెలియదుగానీ, నేనుమాత్రం అతని ఒంటిపై అంగీలేకుండా పరిగెత్తించడం మాత్రం ఖాయం. నా కంటిరెప్ప వెంట్రుకకూడా రామిరెడ్డి కదపలేడు. లోకేశ్ ను ఉద్దేశించి బూతులుమాట్లాడిన రామిరెడ్డికి అప్పుడే ఛాలెంజ్ విసిరా? లోకేశ్ నా నియోజకవర్గంలోకి ఎలావస్తాడో చూస్తానన్న రామిరెడ్డికి దిమ్మతిరిగేలా మా యువనాయకుడిని నియోజకవర్గంలో తిప్పాను.
కాటసాని రామిరెడ్డిని లోకేశ్ కమీషన్ల రామిరెడ్డి అంటే, నేను కోతలరామిరెడ్డి అంటున్నా. రామిరెడ్డికి నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే, తనతండ్రి గొంతుకోసిన వారి నీడను టచ్ చేయాలి. నా అంతుచూస్తానంటున్న రామిరెడ్డికి ఏమాత్రం పౌరుషమున్నా, ముందు తనతండ్రిని చంపిన ఏడుగురి సంగతి తేల్చాలని సవాల్ చేస్తున్నా.

తండ్రిని చంపినవారి పక్కనకూర్చొని రక్తపుకూడు తిన్న రామిరెడ్డికి రోషం, పౌరుషం ఉన్నాయని నేను అనుకోవడంలేదు. నేను రామిరెడ్డికి రాజకీయప్రత్యర్థిని మాత్రమే. ప్రభుత్వంలో ఉన్న రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలువస్తే, వాటిని ఖండించాలిగానీ, వ్యక్తిగతంగా దూషించడం ఏమిటి? రామిరెడ్డి నోటికి పనిచెబితే, మేం చెప్పలేమా? నా ఇంటికి పనివాళ్లను రానివ్వను అనిశపథం చేస్తున్న రామిరెడ్డి వచ్చి నాఇంట్లో బట్టలుఉతుకు తాడా?

రామిరెడ్డి నా నాలుకకోస్తే, నేను అతనివన్నీ కోస్తా. గతంలో సారాయివ్యాపారంచేసిన రామిరెడ్డి, తరువాత కిరాయిహత్యలు, కిడ్నాప్ లుచేసి ఈస్థాయికి వచ్చాడు.రామిరెడ్డి తీరు ఇంకామారలేదా అని బెంగుళూరులో అతనిపై ఉన్నకేసుల్ని సాక్షిదినపత్రికలోనే రాశారు. 2024లో పాతరామిరెడ్డిని చూస్తారంటున్నాడు… మరలా కిరాయిహత్యలు, కిడ్నాప్ లుచేస్తానని చెప్పకనే చెబుతున్నాడు.

420 కేసులకు మిగతాకేసులకు కూడా రామిరెడ్డికి తేడాతెలియదు. మంగళవారం చదువులు చదివిన రామిరెడ్డి నా చదువుగురించి ప్రశ్నిస్తున్నాడు. నేను చదివింది 10వతరగతే. తరువాత డిస్టేన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీపూర్తిచేశాను. గతంలో రామిరెడ్డికూడా నాపై ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేశాడు. నీరు-చెట్టులో అవినీతిచేశానని, ఆర్టీసీబస్టాండ్ ఆక్రమించానని దుష్ప్రచారంచేశాడు. 4 సార్లు విజిలెన్స్ తో దర్యాప్తుచేయించి కూడా రామిరెడ్డి నీరు-చెట్టులో నేను చేశానన్న అవినీతిని నిరూపించలేకపోయాడు.

జీ.ఎన్.ఎస్.ఎస్ లో నేను రూ.60కోట్ల అవినీతిచేసుంటే, అధికారంలో ఉన్న రామిరెడ్డి, అతనిప్రభుత్వం ఏంపీకుతోంది? ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా గెలిచి, ఆపార్టీకి అన్యాయంచేసిన రామిరెడ్డి, తనను గెలిపించిన భూమానాగిరెడ్డిపై విమర్శలు చేశాడు.నారాలోకేశ్ పాదయాత్రలో జనం లేకపోతే రామిరెడ్డికి ఎందుకంత ప్రష్టేషన్? 2వేలమందిలేరు.. 2వందలమందిలేరు…లేకపోతే ఆయనకొచ్చిన ఇబ్బందేంటి?

దిక్కులేక, నిద్రలేని రాత్రుళ్లుగడుపుతున్న రామిరెడ్డి ఎప్పటికీ మమ్మల్ని, మాపార్టీని ఏంపీకలేడు? తనకొడుకు కోసం చేసినభూఆక్రమణలపై రామిరెడ్డి ఏంసమాధానం చెబుతాడు?సర్వేనెంబర్లు మార్పించి, తహాసీల్దార్ సంతకాలులేకుండానే రాత్రికిరాత్రి రెవెన్యూరికార్డులు మార్చి, భూములు కొట్టేయలేదా? నువ్వు చేయని అవినీతి ఏముంది రామిరెడ్డి?

రూ.3కోట్లబిల్లులు నాకు రాకుండా ఆపేసిన రామిరెడ్డి, నేను అధికారులతో మాట్లాడి వాటిని క్లియర్ చేసుకున్నాక, వారిని బెదిరించి 20శాతం కమీషన్ కొట్టేయలేదా?దానిపై రామిరెడ్డి ఎక్కడప్రమాణంచేస్తాడో చెప్పాలి?కార్యకర్తల్ని దోచుకోవడం రామిరెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. రామిరెడ్డి భవనాలు పెరుగుతున్నాయి.. ఆస్తులు పెరుగుతున్నాయి. అతన్ని నమ్ముకున్నవారు మాత్రం రోడ్డున పడుతున్నారు.

రంజాన్ వస్తే రామిరెడ్డిలా వ్యాపారుల్ని బెదిరించి చికెన్, మటన్ తినే బుద్ధినాకులేదు. నాజేబులో డబ్బుతో రంజాన్ మాసంలో పేదలకుపెడతా. లేకపోతే ఇంట్లోకూర్చుంటా. అంతేగానీ బియ్యం వ్యాపారుల్ని బెదిరించి బియ్యం, మాంసం అమ్ముకునేవాళ్లను భయపెట్టి మాంసం లాక్కోను.

రామ్ కో సిమెంట్ పరిశ్రమ నిర్మాణానికి ఆన్ లైన్లో భూమిపూజచేసి, 500ఎకరాలు కేటాయించింది చంద్రబాబుగారు. సింగిల్ విండో విధానంతో అనుమతిఇచ్చింది టీడీపీప్రభుత్వం. రామిరెడ్డి, జగన్ రెడ్డి ఆ పరిశ్రమకు ఏంచేశారని తొడులు కొడు తున్నారు?

రామిరెడ్డి అధికారంహోదా చూసి నేనుభయపడను. ఆయనకు సిగ్గు, రోషముంటే గతంలో నాపైచేసిన ఆరోపణల్ని నిరూపించాలి. ఎక్కడ కోయిలకుంట్ల ఆర్టీసీ బస్టాండ్ కబ్జాచేశానో తేల్చాలి. పేదలకు ఇచ్చే ఇళ్లపట్టాలు బఫర్ జోన్లోకాకుండా మరోచోట ఇవ్వమన్నాం. అది మీవల్లకాలేదు.

షాదీఖానా నిర్మాణానికి నేను రూ.30లక్షలు ఇప్పించాను. అవికాకుండా మరో20లక్షలతో పనులుచేయించాను. దాదాపు 60శాతంపనులుపూర్తయ్యాయి. రామిరెడ్డి వచ్చాక మిగిలినపనులు పూర్తిచేయలేకపోయాడు. ఎప్పటికైనా నా సొంతడబ్బుతో షాదీఖానా నిర్మించి, ముస్లింలకు అప్పగించి తీరతాను అని ఛాలెంజ్ చేస్తున్నా. దాన్ని ఆపాలని రామిరెడ్డి చూస్తే అతని సంగతి ప్రజలే తేలుస్తారు.” రామిరెడ్డి ఇంగితంలేకుండా నన్ను, లోకేశ్ ను తిడితే నేను తిట్టలేనా? ఎమ్మెల్యే అయితే ఏంచేస్తాడు? ప్రజలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలిచేదని తెలుసుకో రామిరెడ్డి.”

LEAVE A RESPONSE