-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
-గాంధీ భవన్ ప్రకాశం హాల్ లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ (KKC) సమావేశం
-పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీ ఖాన్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్, కాంగార్ కర్మాచారి కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ ఉదిత్ రాజు, కాంగ్రెస్ క్యాంపెన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, కేకేసి రాష్ట్ర చైర్మన్ సమీర్ తదితరులు
కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేజెస్ చట్టాన్ని తీసుకొచ్చింది.సకల జనులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మినిమం వేజెస్ బోర్డ్ సమీక్ష చేయకుండా నిర్లక్ష్యము చేస్తున్నది. మినిమం వేజెస్ బోర్డు సమీక్ష జరపకుండా, కనీస వేతనం అమలు చేయకుండా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెప్పాలి.
ఔట్ సోర్సింగ్ విధానంతో శ్రమ దోపిడీకి పాల్పడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కార్మికులు నిలదీయాలి.కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం.కార్మికులకు సంబంధించిన రూ. 10వేల కోట్ల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మిక లోకం బుద్ధి చెప్పాలి.
రాష్ట్రంలో బిపిఎల్ కింద ఉన్న 54 లక్షల కుటుంబాలకు వంద రోజుల పాటు పని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉపాధి హామీ చట్టం నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ చట్టాలు తెచ్చి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.
వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటుపడుతున్నది.2023- 24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకువస్తాం.సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది.
రాష్ట్రంలోని ఫ్యూడలిస్టుల ప్రభుత్వం, దేశంలోని క్యాపిటలిస్టుల ప్రభుత్వం చేసే కుటిల, కుట్రల్లో కార్మికులు పడొద్దు. బాధితులు, బలహీన వర్గాలు ఉన్న అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తాం.దేశంలో కార్మిక చట్టాలు తీసుకువచ్చిన తొలివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్బ్రిటిష్ పాలనల్లో పోరాడి కార్మిక చట్టాలు తెచ్చిన మహానుభావుడు అంబేద్కర్.
శ్రమ దోపిడీ లేకుండా ఎనిమిది గంటల పని విధానం, మహిళలకు ప్రసూతి సెలవులు, అనేక కార్మిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి కార్మికులకు హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుంది