Suryaa.co.in

Telangana

మంత్రి కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ జరుగుతుండగా మాజీ మంత్రి హరీశ్ రావు పై, మంత్రి కోమటిరెడ్డి చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సభ జరుగుతున్నప్పుడు స్పీకర్ నోటీసులో లేకుండా, అనుమతి తీసుకోకుండా, నిరాధార ఆరోపణలు చేయడం అనేది సభా నియమావళి ఉల్లంఘనే అవుతుంది అని స్పీకర్‌కు గుర్తు చేశారు.

సభా హక్కుల ఉల్లంఘనల వివరాలు

రూల్ 319 (ii & iii): సభలో గౌరవ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం లేదా అసభ్యపదజాలం ఉపయోగించడం అనుమతించబడదు. రూల్ 320: సభలో ఎవరిపైనా మాట్లాడాలంటే ముందుగా స్పీకర్‌కు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. రూల్ 45: సభా ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు సభా నియమావళికి విరుద్ధం. గౌరవ సభ్యులపై సభలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం దుర్మార్గమని బిఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొన్నది. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు బిఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.

LEAVE A RESPONSE