బౌద్ధులు, బౌద్ధం ఆది నుంచీ మన దేశానికి, మన సమాజానికి వ్యతిరేకమే!
బౌద్ధులు, బౌద్ధం ఆది నుంచీ మన జాతికి, జాతీయతకూ, దేశానికి, సమాజానికి వ్యతిరేకంగానే పని చేస్తూన్నట్టు చరిత్ర చెబుతోంది. భోగలాలసుడు, పనికిమాలిన మౌర్య రాజు బృహద్రథుణ్ణి బహిరంగంగా చంపి పుష్యమిత్ర శుంగుడు రాజయ్యాడు. ఇది రాజకీయ, సామాజిక పరిణామం. కానీ దీన్ని బ్రాహ్మణ లేదా సనాతన దాడి అని వక్రీకరించి కొన్ని దేశ వ్యతిరేక, సమాజ వ్యతిరేక శక్తులు పబ్బంగడుపు కుంటున్నాయి. అసలు మగధ సామ్రాజ్యం ఏర్పడిందే బ్రాహ్మణుడైన చాణక్యుడి మేధవల్ల! పుష్యమిత్రుడు రాజయ్యాక రాజ్యంపై మిలింద(Milinda) లేదా మనేందర్ (Menander), డెమీట్రిఅస్ (Demetrius) వంటి గ్రీకు రాజులు దండయాత్రలు చేస్తూంటే వాటిని పుష్యమిత్రుడు విఫలం చేస్తూంటే శత్రువులైన ఆ గ్రీకు రాజులకు సాయపడుతూ దేశ ద్రోహానికి పాల్పడ్డారు అప్పటి బౌద్ధులు.
దేశ ద్రోహులైన కొందరు బౌద్ధుల్ని పుష్యమిత్రుడు దేశ రక్షణ నిమిత్తం మట్టుబెట్టాడు. శకల లేదా ఇవాళ్టి సియాల్ కోట్ ప్రాంతంలో గ్రీకు దండయాత్రలకు సాయం చేస్తున్న దేశ ద్రోహులైన బౌద్ధుల్ని ఏరిపారేసే పనిలో భాగంగా వాళ్లను చంపిన వాళ్లకు బహుమతుల్ని ప్రకటించాడు పుష్యమిత్రుడు. ఇదీ సరైన చరిత్ర. ప్రశస్తమైన చరిత్రకారులు H.C. Raychaudhari, H. Bhattacharya, K.P. Jayaswal, Eric Seldeslachts ప్రభృతులు ఈ వాస్తవాల్ని విశ్వవ్యాప్తంగా తెలియజెప్పారు. అంతే కాదు పుష్యమిత్రుడు, అటు తరువాతి శుంగరాజులు పలు బౌద్ధారామాల్ని నిర్మించారని ఆ చరిత్రకారులు తెలియజేస్తున్నారు. CE 5వ శతాబ్దిలోని శ్రీలంక బౌద్ధ గ్రంథం మహావంశం కూడా ఈ సత్యాన్ని తెలియజెబుతోంది. పుష్యమిత్రుడు, శుంగరాజులు బౌద్ధానికి ఏ హానీ చెయ్యలేదు. పుష్యమిత్రుడి కాలానికే బౌద్ధం దేశ ద్రోహం, అవినీతి, అనైతికత, శీలపతనం, అసభ్యతలతో వికారమైపోయింది అని చరిత్ర తెలియజేస్తోంది. అశోకుడి తర్వాత 41 సంవత్సరాలకు బౌద్ధం రాజ పోషణకు ఎంతో దూరం అయిపోయింది.
అశోకుడి మనుమడు సంప్రతి మౌర్యుడు జైనాన్ని రాజ మతంగా చేసుకున్నాడు (వివరాలు నా క్రితం వ్యాసాల్లో ఇవ్వబడ్డాయి). అప్పటికే బౌద్ధం విఫలమూ, పతనమూ అయిపోయిందని ఈ పరిణామం తెలియజేస్తోంది. అప్పుడూ బౌద్ధమతం జనాదరణ పొందిన మతం కాదు; ‘ఎప్పుడూ బౌద్ధం మనదేశంలో పెద్ద శాతం జన మతమూ, అభిమతమూ కాదు’. పుష్యమిత్రుడి కాలం అంటే BCE 185 నుంచే బౌద్ధం దేశ వ్యతిరేక, జన వ్యతిరేక పోకడను నింపుకుని ఉంది. ప్రస్తుత కాలంలోనూ “బౌద్ధం, బుద్ధుడూ” అంటూ కొందరు జాతి వ్యతిరేకతతో, జాతీయతా వ్యతిరేకతతో, దేశ వ్యతిరేకతతో పనిచేస్తూండడం మనం చూస్తున్నాం.
‘బౌద్ధులు దేశ, సమాజ వ్యతిరేకులు’ అవడం 2,000యేళ్ల క్రితమే మనదేశంలో మొదలైందని తెలుస్తోంది. కమ్యునిజమ్ విఫలమయ్యాక ఒకప్పటి కమ్యూనిస్ట్లు కొందరు, కులోన్మాదులు కొందరు, మానసిక రోగులు తమ ఉనికి కోసం, తమ ఆదాయం కోసం, తమ పబ్బం గడుపుకోవడం కోసం “బౌద్ధం, బుద్ధుడూ” అంటూ హానికరమైన రచ్చ చేస్తున్నారు. అటువంటి వాళ్లకు ఉండాల్సిన చదువు, విజ్ఞత ఉండవని, వాళ్లు “బౌద్ధం, బుద్ధుడూ” అంటూ సమాజంపై, దేశంపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని తేట తెల్లంగా తెలిసిపోతోంది. బౌద్ధంవల్ల అశోకుడి రాజ్యం ఆదిగా (నా క్రితం వ్యాసాల్లో వివరాలు ఇవ్వబడ్డాయి) ఏ దేశంలోనూ నైతికత, అహింస, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సామరస్యత, వంటివి గణనీయమైన స్థానాన్ని పొందలేదు. బౌద్ధ దేశాలు వాంఛనీయమైన, ఫలవంతమైన, ఆదర్శవంతమైన దేశాలుగా లేవు.
2,000యేళ్లుగా బౌద్ధం ప్రధాన మతంగా ఉన్న దేశం శ్రీలంక. ఆ దేశం అంతర్యుద్ధంతో పతనమైపోయింది. 97% బౌద్ధమత ప్రజలు ఉన్న కంబోడియా నేరాలు, దాడి, హింస విషయాల్లో ప్రపంచంలో అపాయకరమైన దేశాల్లో ఒకటి. 88% బౌద్ధులు ఉన్న మైయన్మార్(బర్మా) ఒక మత ఘర్షణల దేశం; ఒక హింసాత్మక దేశం. శాంతి, రక్షణల పరంగా మైయన్మార్ వాంఛనీయమైన దేశం కాదు. థాయ్లాండ్ 92% శాతం బౌద్ధులు ఉన్న దేశం. వ్యభిచారానికి థాయ్లాండ్ పెట్టింది పేరు. రెడ్ లైట్ ఏరియాలు కాదు రెడ్ లైట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆ దేశంలో. రాత్రి జీవనానికి ప్రసిద్ధి చెందింది థాయ్లాండ్. లావొస్ లేదా లావొ 64% బౌద్ధులు ఉన్న దేశం. కడు బీద దేశం.
శాంతి, భద్రతలు తిన్నగా ఉండని దేశం. వియత్నాం 55% బౌద్ధులు ఉన్న దేశం. వియత్నాం యుద్ధం గురించి మనకు తెలిసిందే. ఆ యుద్ధానికి వియత్నాం, కంబోడియా, లావొస్ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు, వైషమ్యాలే కారణం. ఈ మూడూ బౌద్ధ దేశాలే. 13వ శతాబ్దిలో జపాన్ దేశంలో బౌద్ధంలోని తెగల మధ్య పెనుహింస చెలరేగింది. 86% బౌద్ధులు ఉన్న మంగోలియా, 78% బౌద్ధులు ఉన్న టిబెట్, 93% బౌద్ధులు ఉన్న తైవాన్, 75% బౌద్ధులు ఉన్న భూటాన్ శాంతి, భద్రతల పరంగా మెరుగైనవైనా జీవన అవసరాలు, అవకాశాలు, ప్రమాణాలు, అభివృద్ధి పరంగా ఈ దేశాలు ఏపాటివో ప్రపంచానికి తెలిసిందే. బుద్ధుడి బోధలకు అతీతంగా బౌద్ధ అశోకుడి కాలం నుంచే హింస, పరమత నరమేధం, అనైతికత (నా క్రితం వ్యాసాల్లో వివరాలు ఇవ్వబడ్డాయి) మన మట్టిలో పెనుమోతాదులో చోటు చేసుకున్నాయి.
పుష్యమిత్రుడి కాలంలోనే బౌద్ధం దేశ ద్రోహానికి పూనుకుంది. ‘సొంత మట్టికి ద్రోహం చెయ్యడం మన దేశంలో బౌద్దులతోనే మొదలయింది!’ అది ఇవాళ్టికీ కొనసాగుతోంది. మత పరంగా ముష్టెత్తుకోవడం కూడా బౌద్ధం వల్లే మన దేశంలో స్థిరపడింది. హున రాజుల, ముస్లీమ్ రాజుల విధ్వంసంవల్ల, పెను శాతం ప్రజలు అసహ్యించుకోవడంవల్ల మనదేశంలో బౌద్ధం లేకుండా పోయింది. బౌద్ధాన్ని బ్రాహ్మణ్యం ధ్వంసం చేసింది అని అనడం పచ్చి అబద్ధం; చదువు లేమి; దేశ సామాజిక వ్యవస్థను దెబ్బకొట్టే భయంకరమైన కుట్ర. గత కొన్ని దశాబ్దులుగా కొన్ని దుష్టశక్తులు మన దేశ సామాజిక సామరస్యాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని దెబ్బకొట్టేందుకు బౌద్ధాన్ని ఎంచుకుని వాస్తవాల వక్రీకరణతో బుద్ధ స్ఫూర్తికి విరుద్ధంగా వికృతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి; తిప్పికొట్టి మన దేశాన్ని, సమాజాన్ని మనం కాపాడుకోవాలి.

9444012279