Suryaa.co.in

Andhra Pradesh National

షిప్పింగ్ కార్పొరేషన్ కు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా చక్రవర్తి

భారత ప్రభుత్వ ఓడరేవులు, నౌకాయానం, జల మార్గాల మంత్రిత్వ శాఖ, ప్రతిష్ఠాత్మక నవరత్న కంపెనీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కె.ఎన్.పి.చక్రవర్తి ని నియమించింది. దేశవ్యాప్తంగా అయిదుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించగా అందులో చక్రవర్తి ఒకరు.
రెండు దశాబ్దాలకు పైగా భారతీయ జనతా పార్టీలో చురుకుగా చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పని చేసినందువల్ల చక్రవర్తికి దక్కిన సువర్ణ అవకాశం. ఈ పదవిలో చక్రవర్తి మూడు సంవత్సరాలు కొనసాగనున్నారు. చక్రవర్తి పార్టీలో విశాఖ యువమోర్చా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా, పని చేయడమే కాకుండా 2012 పాయకరావుపేట బై ఎలక్షన్ లో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు.
ఇంతటి అవకాశం ఇచ్చినందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పురంధరేశ్వరి, జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి, ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్, విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర రెడ్డి లకు చక్రవర్తి ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A RESPONSE