Suryaa.co.in

Andhra Pradesh

జగన్ స్టిక్కర్ వేసుకుంటే చివరికి కుక్క కూడా ఆ స్టిక్కర్ పీకేసింది

-జగన్ ఒక కోడికత్తి కమల హాసన్
-మీ ఆస్తులపై, మీ పాసు బుక్కుపై జగన్ ఫోటో వేసుకుంటున్నాడు
-నవ రత్నాలు కాదు…నవ మోసాలు
-ఒక్కొక్కరిపై రెండు లక్షల కోట్ల అప్పులు పెట్టిన సిఎం జగన్
-జగన్ ఆస్తి రూ. 510 కోట్లు
-వివేకాను రోజూ చంపుతున్నారు
-కోడికత్తి కేసులో టీడీపీకి సంబంధం లేదు అని ఎన్ఐఎ తేల్చి చెప్పింది
-మీరు ప్రశ్నించరా…నేనే దీని కోసం ఫైట్ చేయాలా?
-గుడివాడలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
-జన సందోహం కారణంగా గుడివాడలో నాలుగు గంటల పాటు సాగిన రోడ్ షో

సీఎం జగన్‌ను ‘కోడికత్తి కమలహాసన్’గా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. హత్యకు గురైన వివేకానందరెడ్డిని, రోజుకోరకంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని బూతుల ఎమ్మెల్యే అన్న చంద్రబాబుకు, గుడివాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే…

నా జీవితంలో చాలా సార్లు గుడివాడ వచ్చాను…కానీ ర్యాలీలో, సభలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం నేడు చూశాను. గుడివాడలో ఉన్న యువత, ఆడబిడ్డలు అంతా ఈ రోజు రోడ్డుమీదనే ఉన్నారు. విద్యార్థులు సైతం తెలుగు దేశం పార్టీ జెండా పెట్టుకుని మీటింగ్ కు వచ్చారు.అడుగడుగునా జనం నా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ స్పందన చూసి చెపుతున్నా….ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అన్ని చోట్లా గెలవడం ఖాయంఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు….ఎమ్మెల్యేగా గెలిచిన సీటు గుడివాడ. యుగపురుషుడు తిరిగిన గుడివాడలో…నేడు గంజాయిమొక్క వచ్చింది యుగానికి ఒక యుగపురుషుడు పుడతాడు…అలాంటి వ్యక్తే ఎన్టీఆర్వ.చ్చే మహానాడు రాజమండ్రిలో పెడుతున్నాం. మహానాడు నాటికి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మొత్తం 100 మీటింగ్ లు నిర్వహించబోతున్నాం. దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం.

సామాన్య కుటుంబంలో పుట్టి….అసామాన్య విజయాలు సాధించిన నేత ఎన్టీఆర్ఉ మ్మడి కృష్ణాజిల్లాలో మహనీయులు పుట్టారు. ఈ గడ్డలో మహత్యం ఉంది. అందుకే మహనీయులు జన్మించారు. ప్రపంచానికి గొప్పవారిని అందించిన ప్రాంతం ఈ ప్రాంతం.నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అంతా చూస్తున్నాం. అందుకే అంతా ఇప్పుడు సైకో పోవాలి…సైకిల్ రావాలి అంటున్నారు. మన వాళ్లు కూడా బూతులు మాట్లాడడం మొదలు పెడితే ఈ బూతుల ఎమ్మెల్యేలు పారిపోతారు. ఈ ఎమ్మెల్యేకి రాజకీయ భిక్ష పెట్టింది మనమే. గాడి తప్పిన వీళ్లను చరిత్ర హీనులుగా నిలబెడతాం.రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగాయి….మద్యం సైతం నాసిరకం మద్ అమ్ముతున్నారు.ప్రజల ఆరోగ్యం అంటే సైకోకు లెక్కకూడా లేదు. ఆయన గల్లా పెట్టె కోసం ప్రజల ఆరోగ్యాలు కూడా తాకట్టు పెడుతున్నాడు.

మద్యం తయారీ, సరఫరా, అమ్మకం అంతా జగన్ మనుషులే కిరాణా షాపులో కూడా ఆన్ లైన్ లావాదేవీలు తీసుకుంటున్నారు…మరి మద్యం షాపుల్లో ఎందుకు తీసుకోవడం లేదు. ప్రతి ఒక్కరు ఒక జెండా పట్టుకుని రోడ్డు మీదకు వస్తే ఈ బూతుల ఎమ్మెల్యే రోడ్డు మీదకు వస్తాడా. నిన్నటి వరకు నేనే గెలుస్తా తెలుగు దేశం లేదు అని సిఎం అన్నాడు. విర్రవీగాడు. ఆకాశంలో తిరుగుతున్న జగన్ ను భూమి మీదకు దింపాలి అనుకున్నా.పట్ట భద్రుల ఎన్నికల్లో అన్ని సీట్లూ మనమే గెలిచాం పులివెందుల లో కూడా తెలుగు దేశం జెండా ఎగురవేశాం. ఈ ఎన్నికల ఫలితాలతో ఆకాశంలో ఉండే వ్యక్తి కిందకు చూడడం మొదలు పెట్టాడు. మనకు 23 మంది ఎమ్మెల్యేలు వస్తే హేళన చేశాడు…అందుకే దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు. 23 సంవత్సరం…23 ఓట్లతో 23వ తేదీ మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. దీంతో ఈ సిఎంకు దిమ్మతిరిగింది.

మీ ఆస్తులపై, మీ పాసు బుక్కుపై జగన్ ఫోటో వేసుకుంటున్నాడు. మీ పెద్దలు, పూర్వీకులు ఇచ్చిన భూమి సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసుకుంటాడు అంట. ఇప్పుడు జగనే మా భవిష్యత్…జగనే మా నమ్మకం అని అంటున్నాడు…స్టిక్కర్ వేసుకుంటే చివరికి కుక్క కూడా ఆ స్టిక్కర్ పీకేసింది. నేను 14 ఏళ్లు సిఎంగా పనిచేశాను….నాడు చరిత్రలో గుర్తిండే పనులు చేశాను. ప్రజలు మరిచిపోయినా….నాకు ఆ తృప్తి ఉంటుంది. నాడు హైదరాబాద్ లో నేను చేసిన అభివృద్ది అడుగడుగునా కనిపిస్తుంది. హైదరాబాద్ అభివృద్ది కి కారణం తెలుగుదేశం. మన తెలుగు వాళ్లు అమెరికాలో బ్రహ్మాడంగా రాణిస్తున్నారు.నేను తెలుగు జాతికి ఐటీ అనే ఆయుధం ఇచ్చాను. ఆ ఆయుధంతో తెలుగు వారుప్రపంచ దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఆర్జిస్తున్నారు.

హైదరాబాద్ కంటే మెరుగైన నగరం కావాలని అమరావతిని మొదలు పెట్టాను. అయితే ఈ సైకో ఎమ్మెల్యే, సైకో సిఎం మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు. నా పరిచయాల కారణంగా సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా అమరావతి మాస్టర్ ప్లాన్ చేసి ఇచ్చింది. కృష్ణా డెల్లాకునీరు తేవాలని నాడు 9 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసిన నదుల అనుసంధానం చేశాను. ప్రజలు నీరు తాగారు…పంట పండించుకున్నారు…ఒక్క చాన్స్ కు మోసపోయారు…ముద్దులకు మురిసిపోయారు…జగన్ ను గెలిపించారు. భస్మాసురుడిని నమ్మి శివుడు వరం ఇచ్చినట్లు…మీరు నమ్మి జగన్ ను నమ్మి ఓట్లు వేశారు. నష్టపోయారు.

నా జీవితంలో చాలా మంది నేతలను చూశాను. కానీ జగన్ మాట్లాడితే అబద్దాలే. జగన్ మాట్లాడితే బటన్ నొక్కుడు అంటాడు….బటన్ నొక్కుడు కాదు…జగన్ చేసేది బటన్ బొక్కుడు. నాలుగేళ్లలో రూ. 2 లక్షల కోట్ల అవినీతి చేసిన సిఎం ఈ జగన్ మోహన్ రెడ్డి మద్యం,ఇసుక, సహా అన్నింటిలో దోచుకున్నాడు. ఆయన అనుచరులు, వైసీపీ నాయకులు మరో రెండు లక్షల కోట్లు దోచుకున్నారు. జగన్ చెప్పినట్లు నవ రత్నాలు కాదు…నవ మోసాలు. ఇసుక, మద్యం, గంజాయి, అప్పులు, కబ్జాలు, విద్వంసాలు, భూ మాఫియా రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పు చేశారు….ఒక్కొక్కరిపై రెండు లక్షల కోట్ల అప్పులు పెట్టిన సిఎం జగన్.

దేశంలో ధనికుడైన సిఎం జగన్ మోహన్ రెడ్డి. జగన్ ఆస్తి రూ. 510 కోట్లు. దేశంలో 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తికంటే ఎక్కువ ఆస్తి జగన్ కు ఉంది. 2004లో జగన్ ఆస్తులు కోటి 70 లక్షల మాత్రమే. మరి ఇప్పుడు 500 కోట్లు ఎలా వచ్చాయి. ఇదంతా బొక్కుడు వల్ల కాదా?

నా దగ్గర ఏమీ లేదు….నాకు పేపర్ లేదు…టీవీ లేదు అంటాడు… ఇలాంటి వ్యక్తిని మనం ఎప్పుడైనా చూశామా? బాబాయి వివేకా కేసులో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూశాం. వివేకాను రోజూ చంపుతున్నారు. కోడికత్తి కేసులో టీడీపీకి సంబంధం లేదు అని ఎన్ఐఎ తేల్చి చెప్పింది. అంటే ఇది కోడి కత్తి డ్రామా అని తేలిందా లేదా శ్రీనివాస్ అనే వ్యక్తి వైసీపీ కి చెందిన వ్యక్తి అని ఎన్ఐఏ చెప్పింది.

చంపాలి అనుకుంటే ఎవరైనా కోడికత్తితో దాడిచేస్తారా…. సానుభూతితో ఓట్లు సంపాదించుకున్నారు. జగన్ ఒక కోడికత్తి కమల హాసన్. అందుకే ఇలాంటి వ్యక్తిని మనం నమ్మకూడదు. ఎన్నికల ముందు కేంద్ర మెడలు వంచుతాను అని చెప్పిన జగన్….ఇప్పుడు మెడలు దించాడు. మీరు ప్రశ్నించరా…నేనే దీని కోసం ఫైట్ చేయాలా? జగన్ చెప్పిన ప్రత్యేక హోదా పోయింది…పోలవరాన్ని ముంచేశాడు.

LEAVE A RESPONSE