-రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, నిర్వహిస్తున్న మరమ్మతు పనుల ప్రగతిపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే…:
– రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మత్తుల కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి
– నాడు–నేడు కింద చేపడుతున్న పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోంది
– పనులు ప్రారంభమై ఆసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి
– వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్లో ఉండకూడదు
– వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి
– పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి
– పనులు పూర్తైన వెంటనే త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది
రాబోయే రోజుల్లో కచ్చితంగా ఫలితాలు కన్పించాలి:
-అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా, గుంతలు లేని రోడ్లను తీర్చిదిద్దాలి
– నివర్ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవాలన్న సీఎం
– తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కూడా వెంటనే పనులు చేపట్టాలని సీఎం ఆదేశం
– ఆర్ అండ్ బి పరిధిలో మరమ్మతులు, స్పెషల్వర్క్స్ కింద చేపట్టిన పనులు 1168. మొత్తంగా 7804 కి.మీ. మేర పనులు.
– దీనికోసం రూ.2205 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.
– ఇప్పటికే 675 పనులు పూర్తి.
– కొనసాగుతున్న మరో 491 పనులు.
– మొత్తంగా 62.09శాతం పనులు పూర్తి.
– ఇప్పటికి రూ.1369 కోట్ల విలువైన పనులు చేసిన ప్రభుత్వం.
– మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.
– నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (నిడా–1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపిన అధికారులు.
– 233 పనులకోసం రూ. 2479.61 కోట్ల పనుల్లో రూ.1321.08 కోట్లుఖర్చుచేశామన్న అధికారులు.
– మిగిలిన పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు.
–పంచాతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపైనా దృష్టి:
– 1843 రోడ్లకు రూ. 1072.92 కోట్లుఖర్చు చేస్తున్న ప్రభుత్వం
– 4635 కి.మీ. మేర రోడ్లను బాగు చేయనున్న ప్రభుత్వం
– పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం
– గిరిజన సంక్షేమశాఖలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టాలన్న సీఎం
– ప్రాధాన్యతా క్రమంలో ఇక్కడ కూడా పనులు చేపట్టాలన్న సీఎం
– కార్పొరేషన్లు, మున్పిపాల్టీలలో చురుగ్గా రహదారుల మరమ్మతులు చేపట్టాలన్న సీఎం
జులై 15 కల్లా గుంతలు పూడ్చాలి, జులై 20 న ఫొటో గ్యాలరీలు పెట్టాలి
రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారు
– రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయి.
– అయినా సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం.
– ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్నరంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా కూడా నిధులులోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తిచేస్తున్నాం: సమీక్షలో స్పష్టం చేసిన సీఎం వైయస్.జగన్.
ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), సీఎస్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.