– జార్ఖండ్ సీఎంకు భట్టి ఆహ్వానం
జార్ఖండ్: భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా ఆహ్వానిం చారు. జార్ఖండ్ సీఎం నివాసం లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం హేమంత్ సోరెన్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు ఈ భేటీ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జార్ఖండ్ సీఎం కు వివరించారు.