Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్ వేసిన పునాదులే కాంగ్రెస్ ను నడిపిస్తున్నాయి

– రైతే రాజైతే పుస్తకావిష్కరణ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక తరం.. ఒక అనుభవం. అత్యంత పిన్న వయసు 34 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఆనాడు ఆయన వేసిన పునాదులే కాంగ్రెస్ ను నడిపిస్తున్నాయి. సీఎం కావడానికి ఆయన 20 ఏళ్లు ఎదురుచూశారు. వైఎస్ అనుభవాలు, రాజకీయంగా వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు అందరికీ ఆదర్శనీయం.

ఆయన సీఎం గా ఉన్నప్పుడు విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై చిరునవ్వుతో సమాధానం ఇచ్చేవారు. వైఎస్ ఒక గొప్ప నాయకుడు… ఆదర్శనీయుడు. నూతన సభ్యులను ఆయన ఎంతో ప్రోత్సహించేవారు. 21 శతాబ్దంలో వైఎస్ ఒక్కరే.. ఆయన ఆశయాలను కొనసాగించిన కేవీపీ ఒక్కరే. మళ్లీ ఈ తరంలో అలాంటి నాయకులను చూడలేము.రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాం.. మళ్లీ సంక్షేమ పాలనను అందిస్తాం..

 

LEAVE A RESPONSE