Suryaa.co.in

Telangana

పాల ఉత్పత్తి చేసే రైతులకు సుమారు 35 కోట్ల రూపాయల బాకీ

– రైతులకు లీటర్ కు ఆరు రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని డిమాండ్
-బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి& బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

రాష్ట్రంలో పాల ఉత్పత్తి చేసే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లీటరుకు నాలుగు రూపాయలు ప్రోత్సాహకాన్ని గత అనేక నెలలుగా నిలుపుదల చేసింది. ప్రోత్సాహకాన్ని ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణం.

రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తి చేసే రైతులకు సుమారు 35 కోట్ల రూపాయల బాకీ ఉన్నది. వారికి వెంటనే బకాయిలను ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. పాల ఉత్పత్తికి అవుతున్న ఖర్చు దాన తదితర వాటికి ఎక్కువ అవుతున్నందున రైతులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పాల ఉత్పత్తి చేసే రైతులకు లీటర్ కు ఆరు రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పాల ఉత్పత్తి చేసే రైతులకు ఆరు రూపాయల ఇన్సెంటివ్ (ప్రోత్సాహకాన్ని) ఇస్తుంది.

రైతులకు పదివేల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇస్తామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం .

కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వైట్ రెవల్యూషన్ () కోసం అనేక ప్రోత్సాహకాలను, నిధులను ఇస్తూ ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వాటిని రైతులకు అందించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన రూపంలో రానున్నది.

 

LEAVE A RESPONSE