Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డికి కౌంట్‍డౌన్ మొదలు

– తప్పుడు కేసులు పెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు
– టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు

వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టలాగా తయారయ్యింది. జగన్ మోహన్ రెడ్డి ఆనందం కోసమే మచ్చలేని చంద్రబాబుకి మసిపూసి మచ్చ అంటిస్తున్నారు. కేసులో పేరు లేకపోయినా దొంగ సర్టిఫికేట్లు, దొంగ పత్రాలు చూపించి కోర్టులను మభ్యపెట్టి చంద్రబాబుగారిని అరెస్టు చేయించి పైశాచికానందం పొందుతున్నారు. కోర్టులు వైసీపీకి అనుకూలంగా ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా మాట్లాడుతారు.

నాలుకకు దుమ్ములేదు కాబట్టే నోటికి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల కోసం కనీసం ఒక్క కంపెనీ, అయినా తీసుకొచ్చారా.. జగన్ మోహన్ రెడ్డికి ఖైదీ నెం. 6090 అనే ముద్ర ఉంది. కాబట్టి, చంద్రబాబు గారికి కూడా ఖైదీ అనే ఒక నెం. వేయించి నేరస్తుణ్ని చెయ్యాలని చూస్తున్నారు. 290 కోట్లు ఏ విధంగా స్కామ్ జరిగాయో చెప్పగల సత్తా జగన్ మోహన్ రెడ్డికి గానీ, వైసీపీ నాయకులకు గానీ ఉందా?

చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక కాలంపాటు ముఖ్యమంత్రిగా పాలించారు కాబట్టే జైల్లో ప్రత్యేక సదుపాయాలు పొందటం ఆయన హక్కు. ఈ సదుపాయాలు కూడా మేమే కల్పించాము అని చెప్పడం హేయంగా ఉంది. యువగళం పాదయాత్రలో లోకేష్ గారికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక కుట్రలు పన్ని పాదయాత్రను ఆపాలని చూస్తున్నారు. మా నాయకుడి అరెస్టు రెండు రోజులు మాత్రమే. ఇంకో రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయం… అవినీతిని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ బుద్ది చెప్పడం కూడా ఖాయం.

LEAVE A RESPONSE