Suryaa.co.in

Telangana

మోదీతో సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన “ప్రగతి” సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతి పై సమీక్షించారు. రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తోపాటు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE