Suryaa.co.in

Andhra Pradesh

బటన్‌నొక్కితే సీఎం గ్రాఫ్ పెరుగుతుంది తప్ప ఎమ్మెల్యేలది కాదు

– కార్యకర్తలకు పనులు ఇచ్చి వారిని అప్పుల పాలు చేశాను
– బయటికి బాగున్నంతగా కార్యకర్తల జీవితాలు లోపల బాగా లేవు
– గడపగడపకు వెళ్తే సమస్యలపై అడుగుతున్నారు
– దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు

గడప గడపకు ప్రభుత్వం, వైసీపీ ప్లీనరీలలో కార్యకర్తలు-ప్రజలు అసంతృప్తి స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వాటిని ధృవీకరించాయి. కార్యకర్తలెవరూ సంతోషంగా లేరని, సీఎం జగన్ బటన్‌నొక్కితే ఆయన గ్రాఫ్ పెరుగుతుందే తప్ప ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగడం లేదన్న ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీని గుదిపేస్తున్నాయి. కార్యకర్తలకు పనులిచ్చి తప్పుచేశానని, వందకోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న దర్శి ఎమ్మెల్యే పరిస్థితే తమకూ ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

ఇంతకూ దర్శి ఎమ్మెల్యే ఏమన్నారంటే… జగన్ బటన్ నొక్కితే సీఎం గ్రాఫ్ పెరుగుతుంది తప్ప ఎమ్మెల్యేలది కాదు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లు వెయ్యాలి. వైసీపీకి అండగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవాలి. కార్యకర్తలకు పనులు ఇచ్చి వారిని అప్పుల పాలు చేశాను. దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‍లో ఉన్నాయి . పేరుకుపోయిన బిల్లులను మంజూరు చేయించాలి. కార్యకర్తల్లో ఆనందం నింపాల్సిన అవసరం ఉంది. బయటికి బాగున్నంతగా కార్యకర్తల జీవితాలు లోపల బాగా లేవు. గడపగడపకు వెళ్తే సమస్యలపై అడుగుతున్నారు.

LEAVE A RESPONSE