Suryaa.co.in

Andhra Pradesh

మార్కాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన దివ్యాంగులు

– ప్రభుత్వ సాయం అందడం లేదని చంద్రబాబు కు ఫిర్యాదు
– అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల కోటాలో ఆదుకుంటామని చంద్రబాబు భరోసా

మార్కాపురం:- ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని పలువురు దివ్యాంగులు కలిశారు. తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా మార్కాపురం మండలం, నాయుడుపల్లి పంచాయతీ పరిధిలోని మన్నెంవారిపల్లికి చెందిన మన్నెం వెంకటనాగేంద్ర చంద్రబాబుతో తమ బాధలు చెప్పుకున్నారు. డిగ్రీ చదివినా, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.

ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ తరపున ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందిస్తామని, అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల కోటాలో ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఒంగోలుకు చెందిన వన్నెబోయిన లక్ష్మి నారాయణ కూడా చంద్రబాబు ను కలిసి తన సమస్యలు వివరించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దివ్యాంగులకు సాయం అందడం లో తీవ్ర జాప్యం జరుగుతుందని.. వైసీపీ ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తుంది అని వారు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

LEAVE A RESPONSE