రేవంత్… జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా?

Spread the love

– అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా?
– పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి పిచ్చి ప్రేలాపనలు చేస్తారా?
– టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటే
– వాళ్లద్దరి కుమక్కై మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయబోతున్నరు
– అందుకే పీకే సాక్షిగా టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం చేసుకుంటున్నయ్
– బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక ఈ కుమ్మక్కు రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గ్రానైట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నారని, కేసీఆర్ డైరక్షన్ లోనే సంజయ్ పనిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ‘‘రేవంత్… నువ్వు చేసిన ఆరోపణలను నిరూపించే దమ్ముందా?… నీకు నిజంగా నిజాయితీ ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జోగులాంబ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తావా? నువ్వు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని మేం నిరూపిస్తాం… బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు సిద్ధం. మీరు సిద్ధమా?’’అని సవాల్ విసిరారు. మంగళవారం గద్వాల్ లోని తన నివాసంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ రేవంత్, టీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా స్పందించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ చేపడుతుతున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆమె మండిపడ్డారు.రాళ్లు విసిరి, అలజడి స్రుష్టించి పాదయాత్రను ఆపాలనుకున్న టీఆర్ఎస్ నాయకులు యాత్రకు వస్తున్న స్పందనను చూశాక దిక్కుతోచక అడ్డగోలుగా మాట్లాడుతున్నరని ఆమె అన్నారు. వాళ్లు వాడుతున్న భాష, పద్దతిని చూసి జనం ఛీదరించుకుంటున్నరని,కేటీఆర్ వాడుతున్న భాష జుగుప్పాకరం… ఎడమ కాలి చెప్పుతో పదవిని తన్నేస్తానని కేటీఆర్ చెబుతున్నారని ఇది ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఆ పదవి కోసమే మీరు అడ్డమైన గడ్డి తింటోందని, వేలాది కోట్లు దోచుకుని ఓట్లను కొనాలనుకుంటున్నది ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు.

బీజేపీకి భయపడే టీఆర్ఎస్ పార్టీ పీకే ను తెచ్చుకుందని,. ప్రజలు టీఆర్ఎస్ను నమ్మడం లేదని గ్రహించి… కొత్త మోసాలు ఏం చేయాలనే విషయంపై చర్చించడనికే పీకే ను మీ అయ్య పిలుచుకు ఉన్న సంగతి ఇ తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు.

టీఆర్ఎస్ అడుగడుగునా ప్రజావిశ్వాసం కోల్పోయిందని, అందుకే మళ్లీ గెలిచేందుకు పీకే అనే కన్సల్టెన్సీకి తెచ్చుకున్నడని, పీకే కాదు కదా…. టీఆర్ఎస్ ఇంకెంతమంది కన్సల్టెన్సీలను తెచ్చుకున్నా లాభం లేదని,తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించడానికి సిద్దమైపోయిండ్రని, బీజేపీకి అధికారం అప్పగించడానికి సిద్దమయ్యారని డీకే అరుణ అన్నారు.

అందుకే బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ తో కుమ్కక్కై పీకేతో మంతనాలు చేస్తున్నరని,రేవంత్… మీరు, కేసీఆర్ కలిసి దొంగాట ఆడుతున్నరని ఆమె దుయ్యబట్టారు. మీ పార్టీలోనే కొందరు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని గెలవాలని భావిస్తే… ఇంకొందరేమో టీఆర్ఎస్ నియంత పాలనకు అడ్డుకట్ట వేయాలనుకుని మథనపడుతున్నరని ఆమె అన్నారు.

రేవంత్ మీద ఎన్నెన్ని ఆరోపణలున్నయి… కాంగ్రెసోళ్లే రేవంత్ ను బ్లాక్ మెయిలర్ అంటున్నారని తెల్వదా? అలాంటి మీరు సంజయ్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు.
సంజయ్ పై వచ్చిన ఆరోపణలను నిరూపించగలరా? జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద బండి సంజయ్ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి ప్రమాణం చేయించేందుకు మేం సిద్దం. మీరు చేయగలరా? అంటూ సవాల్ విసిరారు.

రాజకీయాల్లో కేసీఆర్ లాగా సంస్కార హీనమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజలు హర్షించరని,
హుజూరాబాద్ లో మీ పార్టీ దుస్థితి ఏ విధంగా ఉందో కళ్లారా ఉప ఎన్నికల ఫలితాల్లో చూశామని, గల్లీలో, ఢిల్లీలో నాయకత్వం లేదని, ఎవరు బలంగా ఉంటే వాళ్లను తొక్కాలనే స్వభావం వాళ్ళదని ఆమె విమర్శించారు.

కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని, ఆ పార్టీ వల్ల ఈ దేశం బాగుపడుతుందనే నమ్మకం ప్రజల్లో పోయిందని, మోదీ వల్ల దేశంలో, రాష్ట్రంలో అభివ్రుధ్ధి సాధ్యమనే భావనకు ప్రజలువచ్చారని ఆమె అన్నారు.
అందుకే తెలంగాణలో కూడా అట్టడుగున ఉన్న వారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనే కోరుకుంటున్నారనారు.బీజేపీ తెలంగాణకు మద్దతివ్వకపోతే రాష్ట్రం ఏర్పడేదా? మీ అయ్య సీఎం, నువ్వు మంత్రి అయ్యేటోడివా? మీ అయ్యలాగే నువ్వూ సోయి తప్పి మాట్లాడుతున్నవా? అంటూ డి.కె.అరుణ మండిపడ్డారు.

Leave a Reply