Suryaa.co.in

Telangana

కేసీఆర్…. నీకు మూడింది

– నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నవ్?
– ప్రశ్నించే గొంతులను అణిచివేస్తావా?
– పేపర్ లీకేజీలో నీ కొడుకు పాత్ర, దొంగ సారా దందాలో నీ బిడ్డ పాత్ర బయటకొచ్చేసరికి అరాచకాలు చేస్తవా?
– మళ్లీ నిజాం పాలనను కళ్లారా చూస్తున్నాం
– పోలీసులా? బీఆర్ఎస్ గూండాలా….? దొంగల్లాగా ఎత్తుకుపోతారా?
– తెలంగాణ వాదులారా…. బయటకు రండి
– మీడియా సంస్థల్లారా…. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గకండి
– ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం కలిసి రండి…
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలనకు మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ, దాడులు చేస్తూ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని అన్నారు. తక్షణమే సీనియర్ జర్నలిస్టులు తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్, సుదర్శన్, సతీష్ కమాల్ లను భేషరతుగా వదిలివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతి కుమార్ తదితరులతో కలిసి తీన్మార్ మల్లన్న నివాసానికి వచ్చిన బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులను కలిసి మల్లన్న అరెస్ట్ వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రశ్నించే గొంతుకలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…తీన్మార్ మల్లన్నను దొంగల్లా ఎత్తుపోతారా? పోలీసులా? బీఆర్ఎస్ గూండాలా? ప్రశ్నించే గొంతులను అణిచివేస్తారా? కేసీఆర్…. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావ్? ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేసి ఏం చేయదల్చావ్. మీడియా సంస్థలారా… ఒక్కసారి మీరు ఆలోచించండి.. కేసీఆర్ ఒత్తిడి తలొగ్గితే ప్రజాస్వామ్యమే ప్రమాదం లో పడుతుంది. మీరంతా ఏకం కండి… ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.దొంగ సారా దందా చేసిన కవితను ఈడీ విచారణ చేస్తుంటే ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ వెళతారా? ఆమె తప్పులను ఫ్రశ్నించిన మల్లన్నను, విఠల్ ను దొంగల్లాగా ఎత్తుకపోతారా?

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కొడుకు పాత్ర ఉంది. ఇదే విషయాన్ని మల్లన్న చెబితే అరెస్ట్ చేస్తారా? తెలంగాణ వాదులారా…. ఇంకెన్నాళ్లు భయపడతారు? కేసీఆర్ కు భయపడితే తెలంగాణ సాధించుకునేదెందుకు? మీకోసమే తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తున్నారు. మీరంతా అండగా ఉంటుందనే నమ్మకంతోనే ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సమాజమంతా మల్లన్నకు అండగా లేకుంటే… అట్లా కాకుండా ఇంకా ఉపేక్షిస్తే సామాన్య ప్రజలెవరూ రోడ్లపై తిరిగే పరిస్థితి కూడా ఉండదు.మల్లన్న బిడ్డ పసిపాప. తండ్రిని చూడకుండా ఉండలేదు… అల్లాడిపోతోంది. వెంటనే మల్లన్నను, విఠల్ ను, సతీష్ కమాల్ ను వెంటనే భేషరతుగా విడుదల చేయాలి. విఠల్ ఆరోగ్యం బాగోలేదు. ఏం జరిగినా సీఎందే బాధ్యత. తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదంతా కేసీఆర్ కొడుకు ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. ప్రజలు తిరగబడే సమయం వచ్చింది.

LEAVE A RESPONSE