Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే వెల్లంపల్లికి మోదీని విమర్శించే స్థాయి ఉందా……?

-రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్డూరి శ్రీరామ్

మూడేళ్లలో నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి పనిని చేయని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని భాజపా నాయకులు అడ్డూరి శ్రీరాం హెచ్చరించారు. ఆయన ఇలా మాట్లాడారు… గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన మేలు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. వైకాపా ఇచ్చే నవరత్నాల్లో ఒక్క అమ్మ ఓడి తప్ప మిగతా 8 రత్నాల్లో సింహభాగం నిధులు భాజపా ఇచ్చేవే. పోలవరానికి పూర్తి నిధులు ఇస్తుంది భాజపానే. పోలవరం ప్రాజెక్టును ఎటీఎంగా మార్చుకున్నది వైకాపా, తెదేపా ప్రభుత్వాలు కాదా? విజయవాడ మహానగరంలో దుర్గమ్మ, బెంజిసర్కిల్ పైవంతెనలు ఎవరు నిర్మించారో వెలంపల్లి సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ పేరుతో వైకాపా ఇచ్చే కార్పొరేట్ వైద్యంలో భాజపా ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ నిధులు లేవా ? నాడు నేడు పథకంలో వాడే నిధులు కేంద్రం ఇచ్చే సర్వ శిక్ష అభియాన్వి కావా? రైతు భరోసా పేరుతోనే మీరిచ్చే రూ.13 వేలలో సింహభాగం ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద ఇచ్చే నిధులు ఉన్నాయి.

మూడేళ్లలో మీ నియోజకవర్గంలో ఒక్క రోడైనా వేశారా ? మంత్రిగా రెండున్నర ఏళ్లపాటున్నా పశ్చిమ అభివృద్ధికి ఏం చేశారో సమాధానం చెప్పండి. కేంద్రం నిర్మించిన ఇళ్లలో ఒక్కటీ పేదలకు ఇవ్వలేదు. రాష్ట్రంలో రహదారులు, రైల్వేలైన్లు వేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తోన్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాల్సింది. పోయి రాజకీయ కోణంలో దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం? మీపై ప్రజలలో వున్న వ్యతిరేకతను భాజపాపై మోపాలనే ప్రయత్నం మానుకోండి. అన్ని రంగాల్లో ప్రజల్ని కుదేల్ చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదే. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, అవినీతి రహిత పాలన అందిస్తా ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీకు లేదు.

LEAVE A RESPONSE