Suryaa.co.in

Telangana

హైకోర్టు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులకు వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు సమస్యలను వినోద్ కుమార్ దృష్టికి తీసుకొని వచ్చారు. హైకోర్టులోని మెడికల్ డిస్పెన్సరీని అప్గ్రేట్ చేసి వైద్య సిబ్బందిని నియమించాలని, లైబ్రరీ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ట్రేని న్యాయవాదులకు స్టాండింగ్ కౌన్సిల్ గా అవకాశాలు కల్పించాలని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు వినోద్ కుమార్ ను కోరారు.

వినోద్ కుమార్ తో సమావేశమైన వారిలో హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కళ్యాణ్ రావు, కార్యదర్శి దేవేందర్, కార్యవర్గ సభ్యులు, తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE