• రాష్ట్రాన్ని అప్పుల కూప్పగా మార్చి… అప్పుడే అన్ని అమలు చేయాలంటూ పెడబొబ్బలు
• వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు
• అరాచకాలు, హత్యలు, గంజాయికి అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారు
• 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయినా పట్టించుకోలేదు
• మాచర్లలో అరాచకం సృష్టించిన ఖైదీని పలకరించేందుకు వెళ్లిన జగన్ రెడ్డి ఎలాంటి వాడో ప్రజలే అర్థం చేసుకున్నారు
• మాట తప్పడం… మడమ తిప్పడం జగన్ రెడ్డికి మాత్రమే తెలుసు
• చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారు
• ఇకనైనా జగన్ రెడ్డి మారాలి… లేదంటే ప్రజలు ఛీ కొట్టడం ఖాయం
• సాక్షిలో తప్పుడు రాతలపై మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం
మంగళగిరి: పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు సాక్షి, జగన్ రెడ్డి తీరు ఉందని… అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి… అరాచకాలు, హత్యాచారాలు, గంజాయి, డ్రగ్స్ కు ఏపీని కేరాఫ్ గా మార్చి.. నేడు కూటమి అధికారం చేపట్టి నెల కూడా గడవకముందే అప్పుడే హామీలన్నీ అమలు చేయాలంటూ పెడబొబ్బలు పెట్టడం సిగ్గుచేటని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
పీతల సుజాత మాట్లాడుతూ.. మాట తప్పడం మడమ తిప్పడం జగన్ రెడ్డికి మాత్రమే తెలుసు… మా నాయకుడు మాట ఇస్తే తప్పరు ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. ఒక్కొక్కటిగా నెరవేరస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రజలు ఛీ కొట్టినా జగన్ కు బుద్ధి రాకపోవడం సోచనీయం. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకొని నెలకూడా కాకుండానే సాక్షిలో తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు. వైసీపీ, సాక్షి దిగజారుడు తననానికి నిదర్శనం ఇది.
వైసీపీ పాలనలో అన్ని విధాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రజలకు వైసీపీ కల్పించిన ఇబ్బందులను చంద్రబాబు తొలగిస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఐదు సంతకాలు పెట్టారు. దాదాపు 65 లక్షల మందికి రూ. 4,408 కోట్లు అట్టహాసంగా రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేశారు. పెంచిన వెయ్యితో కలిపి రూ. 7000 పింఛన్ ఇంటి వద్దే అందించారు. ఇవి మీ కంటికి కనిపంచడంలేదా..? వాలంటీర్లు లేకుంటే పింఛన్ల పంపిణీ చేయలేని మీరు 60మంది అవ్వతాతలను చంపిన మీరు తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు.
ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ది మీకు లేదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పాం … ఖచ్చితంగా అమలు చేస్తాం. సాక్షిలో రాసిన ఆడబిడ్డ నిధిని కూడా అందిస్తాం … జగన్ రెడ్డిలా మాట ఇచ్చి మడమ తప్పే ప్రభుత్వం కాదు. ఆడ బిడ్డ నిధి నియమ నిబంధనలకు అర్హులైన వారందరికి అందిస్తాం. సాక్షిలో రాతలు జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి ఒక మహిళా ఓటర్ అని ఆమెకు కూడా ఆడబిడ్డ నిధిని వర్తింప చేయమని రాసినట్లు ఉంది.
2019 లో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. మరి ఎప్పుడు అమలు చేశారు? ఎంత మందికి ఇచ్చారు? అందులో స్కూల్ మెయింటెన్స్ అంటూ కోతలు పెట్టి పిల్లలను మోసం చేశారు. అదికూడా అధికారం చేపట్టిన సంవత్సరం తారువాత అమ్మఒడిని అమలు చేశారు.
పత్రిక, టీవీ ఉందని తప్పుడు రాతలు రాస్తే ప్రజలు నమ్ముతారని అనుకోకండి. ఇకనైనా జగన్ భ్రమనుండి బయటకు రావాలి. ఆకాశం మీద ఉమ్మివేస్తే తిరిగి మీ మీదే పడుతుంది అది మీరు గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రాన్ని అప్పుల ఊభిలో నెట్టారు. దాదాపు రూ. 2 లక్షల కోట్ల బకాయిల పెట్టారు అవి ఎవరు తీర్చాలి? మీరు దోచుకుని దాచుకుని పోయారు … మీరు తిన్న సొమ్ములకు కూటమి భాద్యత వహించాలా? అభివృద్ధి సంక్షేమానికి కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు.
చంద్రబాబును గాని కూటమి ప్రభుత్వాన్ని గాని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఆసరా పేరుతో మహిళలకు అన్యాయం చేశారు. చేయూత పేరుతో చేతివాటం చూపించారు. వంద హామీలు ఇచ్చి 80 హామీలు అమలు చేయలేదు. అందుకే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. మీకు ఉన్న 151 ఎమ్మెల్యేల్లో మధ్యలో ఉన్న ఐదును తీశారు. ఈసారి ఉన్న పదకొండులో ఒకటి లేపేస్తారు.
వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అరాచకాలు, హత్యలు, గంజాయి, మాధక ద్రవ్యాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ గా మార్చారు. ఎన్సీఆర్పీ రిపోర్టులో కూడా వైసీపీ పాలనలో నేరాలు పెరిగాయని చెప్పింది అయినా పట్టించుకోలేదు. వైసీపీ పాలనలో 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ కుటుంబాల బాధ ఎవరు తీరుస్తారు. ఆ కుంటుంబాలను ఎప్పుడైనా పట్టించున్నారు?
చంద్రన్న అంటే ఒక ధైర్యం, చంద్రన్న అంటే మహిళలకు ఒక భరోసా.. చంద్రబాబు మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారు. చంద్రన్న మహిళా పక్షపాతి. మహిళలకు కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారన్న నమ్మకంతోనే చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మిస్ అయిన అమ్మాయిలను చట్టం ద్వారా కనుక్కుని వారి దగ్గరకు చేర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రజల భూములను కొట్టేసేందుకు మీరు తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దు చేశాం. అన్నా క్యాంటీన్ లు తెరుస్తున్నాం.
దమ్ముగా ధైర్యంగా ప్రజలను జగన్ రెడ్డి కలవలేడు. ప్రజల్లోకి వెళ్లాలంటే జగన్ రెడ్డికి పరదాలు కావాలి. జగన్ రెడ్డి ప్రజా తీర్పు గౌరవించకుండా మాచర్లలో అరాచకం సృష్టించి ప్రజలను ఊచకోత కోసి ఎన్నికల్లో విధ్వంసం సృష్టించి కటకటాల్లోకి వెళ్లిన ఖైదీని పరామర్శించి అతన్ని మంచివాడని చెబుతున్నాడు. అలాంటి జగన్ ఎలాంటి వాడో ప్రజలకు అర్థం అయ్యింది.
ఇకనైనా జగన్ రెడ్డి మారాలి. లేదంటే ప్రజలు ఛీ కొట్టడం ఖాయం. మా నాయకుడు తప్పును ఉపేక్షించరు… ప్రజలకు ఎక్కడ కష్టం కలిగినా నష్టం కలిగినా ఒప్పుకోరు. లోకేష్ బాబు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నారు. చంద్రబాబు పాలనలోనే ఎక్కువ టీచర్ పోస్టు లు ఇచ్చారు.
అత్యధిక టీచర్ పోస్ట్ లు ఇచ్చిన ఘనత ఆయనదే. వైసీపీ పాలనలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు. టెట్ లో క్వాలిఫై కానివారికోసం మరోసారి పరిక్షను నిర్వహించేందు చర్యలు చేపట్టినట్లు మా మంత్రి లోకేష్ బాబు తెలిపారు. వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.